July

ఏచూరికి 'రామచంద్రన్‌' అవార్డు

 ప్రజాసేవలో విశేష కృషికి గాను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని 'ఎన్‌. రామచంద్రన్‌ స్మారక అవార్డు'తో సత్కరించారు. కేరళకు చెందిన ప్రఖ్యాత పాత్రికేయుడు ఎన్‌. రామచంద్రన్‌ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఎన్‌. రామచంద్రన్‌ పౌండేషన్‌ను ఏర్పాటు చేశారు.

జన్‌ధన్‌ తరహాలోఎపి సొంతబీమా

దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తిరపు కార్డులు ఇవ్వాలన్న ఆధార్‌ విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేనట్టు కనిపిస్తోరది. అరదుకే సొరతంగా అరదరికీ ఒక నంబర్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం యూనిక్‌ ఐడెరటిటీ ఫర్‌ రెసిడెరట్స్‌ పేరిట ఒక విధానాన్ని ప్రకటిరచిరది. దీనిపై ప్రత్యేక సర్వే కూడా నిర్వహిరచాలని నిర్ణయిరచిరది. అలాగే కేదద్రం అమలు చేస్తున్న జన్‌ధన్‌ యోజన పథకానికి దీటుగా రాష్ట్రంలోకూడా మరో బీమా పథకానికి సమాలోచనలు చేస్తోరది. దీనికోసం ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి.

హోదా రాదని బాబుకూ తెలుసు

ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం నాయకుల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఆ హోదా రాదని, చంద్రబాబు సహా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెలేలందరికీ ముందే తెలిసినా ప్రజలను నమ్మించేందుకు ప్రయత్ని స్తున్నారని అనంతపురం ఎంపీ జె.సి.దివాకరరెడ్డి అభిప్రాయ పడ్డారు.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశం సందర్భంగా శనివారం విజయవాడ వచ్చిన ఎంపీలు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దివాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా, ఉనప్పుడు మరో విధంగా మాట్లాడటం సరికాదని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

క్రిడా కార్యాలయం ముట్టడి

కౌలు చెక్కులివ్వాలని డిమాండ్‌ చేస్తూ అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులు తుళ్ళూరు క్రిడా కార్యాలయాన్ని ముట్టడించారు. లైబ్రరీ సెంటర్‌ నుండి ర్యాలీ నిర్వహించి క్రిడా కార్యాలయం ఎదుట గంటకు పైగా బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, పేద వ్యవసాయ కూలీలకు రూ. 2,500 పింఛన్‌, అసైన్డ్‌, సీలింగ్‌ భూముల రైతులకు కౌలు చెక్కులివ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్రిడా ప్రాంత సిపిఎం కన్వీనర్‌ సిహెచ్‌.బాబురావు, సిపిఎం డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నాయకులు జొన్నకూటి వీర్లంకయ్య, నవీన్‌ప్రకాష్‌ ఆందోళనకు మద్దతు తెలిపారు.

ర్యాగింగ్‌పైరగిలినవిద్యార్థులు

నాగార్జున యూనివర్సిటి బిఆర్క్‌ విద్యార్థిని రిషితేశ్వరి మృ తికి కారకులైన దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని, సిట్టింగ్‌ జడ్జితో ప్రభుత్వం తక్షణం విచారణ జరిపించాలంటూ విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి చం ద్రబాబు స్పందించి బాధ్యులైన వారిని అరెస్టు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. క్యాంపు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు,అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకొన్నాయి.

ప్ర‌త్యేక హోదా కై ఉద్య‌మం...సిపిఎం రాష్ట్ర క‌మిటి

ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర మంత్రి ఈ రోజు లోక్‌సభలో ప్రకటించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్రకమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది.
రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ బ్లిుపై చర్చ సందర్భంగా ఆ నాటి ప్రధాని చేసిన ప్రకటన, నాటి ప్రతిపక్ష పార్టీ నాయకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాని రాష్ట్రకమిటి డిమాండ్‌ చేస్తున్నది.

మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి.

ఆధార్‌ తప్పనిసరి కాదు:సుప్రీం

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలతోపాటు సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ వివరించారు.

Pages

Subscribe to RSS - July