July

పశ్చాత్తాపం - ఫలితం?

జులై 30వ తేదీకి ఉరిశిక్ష విధించిన బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. జీవిత ఖైదీకి మనదేశంలో విధించే శిక్ష 14 నుంచి 20 సంవత్సరాలు. ఆ విధంగా చూస్తే యాకూబ్‌ మెమన్‌ ఇప్పటికే ఒక జీవిత ఖైదు అనుభవించాడు. పోనీ నిందితుణ్ణి మన చట్టబద్ధ సంస్థలు శోధించి బంధించాయా? దానికి ఎంత పరిశోధన చేశాయి? ఎలా పట్టుకున్నాయి? అని ప్రశ్నించు కుంటే అలాంటిదేం లేదు. మెమన్‌ తనకు తానుగా లొంగిపోయాడు. లొంగిపోయిన అతణ్ణి అరెస్టు చేసి ఆయన ఇచ్చిన సమాచారంతోనే విచారణ సాగించిన సంస్థలు సుదీర్ఘ విచారణ చేసిన మేరకు అతడే నిందుతుడని తేల్చిన టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది.

భారతీయులకు రామన్ మెగాసెసే అవార్డు

ఫిలిఫ్పెన్స్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే రామన్ మెగాసెసే అవార్డు ఈ సారి ఇద్దరు భారతీయులను వరించింది. ఎయిమ్స్ డిప్యూటీ సెక్రటరీ సంజీవ్ చతుర్వేది, గూంజ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అన్షుగుప్తా ఎంపికయ్యారు

ఘనంగా కామ్రేడ్ జనార్ధన్ రెడ్డి వర్ధంతిసభ

గూడూరులో జరిగిన కామ్రేడ్ ఇందుకూరు జనార్ధన్ రెడ్డి ప్రధమ వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన మీటింగ్ హాలుని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ,స్థానిక సిపిఎం నాయకులు,పార్టీ అభిమానులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Pages

Subscribe to RSS - July