July

ఆర్‌బీఐ గవర్నరుగా అరవింద్‌ పనగారియా..

ఆర్‌బీఐ గవర్నరుగా రఘురాం రాజన్‌ పదవీకాలం సెప్టెంబరు 4తో ముగియనుంది. రెండోవిడత ఈ పదవిలో కొనసాగబోనని, గత నెలలో రాజన్‌ ప్రకటించినప్పటి నుంచీ, ఆయన వారసత్వం ఎవరికి దక్కుతుందనే విషయమై పలు వూహాగానాలు వస్తున్నాయి. మరో రెండురోజుల్లోనే ఆర్‌బీఐ తదుపరి గవర్నర్‌ ఎవరో తేలుతుందని, పనగారియాకు అధిక అవకాశాలున్నట్లు తాజాగా ప్రచారం సాగుతోంది. ఈనెల 18లోగా ఆర్‌బీఐ గవర్నరు పదవిపై నిర్ణయం తీసుకుంటామని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

ఎన్నికల సమయంలో మాయావతికి షాక్‌

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్‌ తగిలింది. బీఎస్పీ నుంచి మరో కీలక వ్యక్తి పార్టీకి దూరమయ్యారు.దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేశారు. గత నెల రోజుల వ్యవధిలో నలుగురు ముఖ్య నేతలు పార్టీని వీడటం గమనార్హం.

సోనియా, ఒమర్‌తో రాజ్‌నాథ్‌ మంతనాలు

జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.జమ్ముకశ్మీర్‌ సంక్షోభంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాతో మాట్లాడారు.కశ్మీర్‌ అల్లర్లలో ఇప్పటి వరకు 21 మంది మృతి చెందారు. ఉగ్రవాది బుర్హాన్‌ వనీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

బహుళజాతి సంస్థల సామ్రాజ్యానికి బాటలు

 ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ (టిటిఐపి) ఒప్పందంపై అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఇయు) మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందానికి అనుబంధ ఒప్పందంగా అమెరికా పరిగ ణిస్తున్నది.

కూలిన సచివాలయ గోడ ఐదుగురికి తీవ్రగాయాలు

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన రామ్‌చంద్‌, ధర్మేంద్ర, కిరణ్‌ఛౌదరి, జయరామ్‌లతోపాటు మరో వ్యక్తికీ గాయాలయ్యాయి. వీరిలో రామ్‌చంద్‌కు వెన్నుముక విరిగిపోగా ధర్మేంద్రకు తలకు, ఛాతికి, కాలికి తీవ్రగాయాలయ్యాయి.

భాదితులకు 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ పిట్టగోడ కూలి ఐదుగురు కార్మికులకు సోమవారం తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స కోసం ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. సిపిఎం క్రిడా సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిహెచ్‌ బాబూరావు, రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం రవి తదితరులు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా కార్మికులను, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాబురావు మాట్లాడుతూ, సచివాలయంలో అనేక దుర్ఘటనలు జరుగతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

శివసేనకు చేదు అవమానం..

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మరోసారి బీజేపీ భాగస్వామ్య పక్షమైన శివసేనకు చేదు అవమానం ఎదురైంది. మోదీ ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణలో శివసేనకు చోటు దక్కకపోవడంతో ఆ పార్టీ ఇప్పటికే అసంతృప్తితో రగిలిపోతోంది. 

రియల్ ఎస్టేట్ రాజధాని..

రైతులకు ప్లాట్లు ఇవ్వడం మొదలుపెట్టాక వాటితో వ్యాపారం చేయించేందుకు సిఆర్‌డిఎ సిద్ధమైంది. ప్లాట్లతో గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో అభివృద్ధికి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బిల్డర్లతో చర్చలు చేపట్టింది.రైతుల భూముల అభివృద్ధికి ముందుకొస్తే బిల్డర్లకు సిఆర్‌డిఎ నుండి అవసరమైన సహాయం అందిస్తామని, సిఎంతో సమావేశం అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఇన్‌ఛార్జి కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించారు. దీనికి అవసరమైతే చిన్న చిన్న ప్లాట్లు కలుపుకొని పెద్ద కమతాలుగా మార్చుకునేందుకు అవసరమైన నిబంధనలను సవరిస్తామని హామీ ఇచ్చారు.

స్మృతి తొందరపాటు నిర్ణయాలే కారణమా

దేశ వ్యాప్తంగా విద్యార్థుల ఉద్యమాలు చెలరేగడానికి ఆమె తొందరపాటు నిర్ణయాలు కారణమయ్యాయని బీజీపీ అధిష్టానం గుర్తించడంతోనే ఆమె శాఖపై వేటు పడింది. ముఖ్యంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ, హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థుల్లో అలజడికి ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విషయం తెల్సిందే.

బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు..?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది. 

Pages

Subscribe to RSS - July