2017

రొయ్యల చెరువులు, ఆక్వా ప్రొసెసింగ్ ప్లాంట్ల కాలుష్యాన్ని నివారించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ

వంశధార నిర్వాసితులకు పరిహరం చెల్లించాలి :CPM

వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది.  నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు 

'పెట్టుబడి' గ్రంధాన్ని చదవాలి

పెట్టుబడి దారి వ్యవస్థలో పాలకులు అవలంభిస్తున్న వైఖరి వల్ల దేశంలో దోపిడీ, ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ పేర్కొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యత' అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరిగింది. శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శర్మ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి వ్వవస్థ నుంచి మార్పును, విప్లవాన్ని కోరుకునే వారు తప్పని సరిగా కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంధం చదవాలని కోరారు.

వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన కోసం ప్రజా సమీకరణ

మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్న క్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి వారితో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను రూపొందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'అక్టోబర్‌ మహా విప్లవ శతవార్షికోత్సవ సభ'కు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ..

Pages

Subscribe to RSS - 2017