2017

స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించడానికి వెళ్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను విజయవాడ రైల్వే స్టేషన్ లో కలిసి సంఘీభావం తెలుపుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు,కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మరియు సిఐటియు నాయకులు..

గ్యాస్ ధర పెంపుపై నిరసన

కేంద్ర ప్ర‌భుత్వం వంట గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం నాయకులు విజ‌య‌వాడ‌లో నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ చేపట్టారు. నెలకు 4 రూపాయల చొప్పున గ్యాస్ రేటు పెంచడంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్యాస్ పై సబ్సిడీని కొనసాగించాలని డిమాండ్ చేశారు. 

పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి

పోలవరం నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో న్యాయపరమైన పరిహారం, పునరావాసం కల్పించాలని కోరుతూ చింతూరు లో ర్యాలీ, చట్టివద్ద జాతీయ రహదారిపై బైఠాయింపు..ర్యాలీలో పాల్గోన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మిడియం బాబురావు, భద్రచలం ఎమ్మేల్యే సున్నం రాజయ్య..

దళితులపై దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర సదస్సు

రాష్ట్రంలో దళితులపై పలు విధాలుగా జరుగుతున్న దాడులు, కులవివక్ష, దళితుల భూముల్ని లాక్కోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పది వామపక్షాలు రాష్ట్ర సదస్సు నిర్వహించాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరాపల్లి తదితర గ్రామాల్లో అనేక దశాబ్దాలుగా సాగు చేస్తున్న దళితుల భూముల్ని 'నీరు-చెట్టు' పేరుతో ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకోవడం, పశ్చిమ గోదావరి జిల్లా గరగ పర్రులో దళితులపై గత మూడు నెలలుగా సాంఘిక బహిష్క రణ చేయడం, చిత్తూరు జిల్లాలో మహాభారతం పేరుతో సాగే ఉత్సవాల్లో దళితుల పట్ల వివక్ష కనబర్చడం వంటి చర్యలపై ఈ సదస్సులో చర్చించారు.

విశాఖపట్నం లోని హిందూస్తాన్ జింక్ కు చెందిన స్థలాల్ని వేదాంత కంపెనీ అమ్మకానికి పెట్టడాన్ని ప్రభుత్వం అనుమతించరాదు

Pages

Subscribe to RSS - 2017