ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులను నిర్బంధించి వారి భూములను సాగు చేసుకుంటున్నారనే విషయం తెలుసుకుని వారికి మద్దతుగా వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, నాయకులు వై.వెంకటేశ్వరరావులను అరెస్టు చేయడాన్ని వామపక్ష పార్టీలు ఖండించాయి.అధికార యంత్రాంగం పెత్తందారులకు మద్దతుగా పోలీసులను పంపించి వారి పహారాలో దళితుల భూముల్లో చెరువులు తవ్వుతోం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, దేవరపల్లి దళితులు సాగులో ఉండేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వారు పార్టీ శ్రేణులను కోరారు.
పార్టీ కార్యక్రమాలు
గరగపర్రు దళితులపై సాంఘిక బహిష్కరణను నిరసిస్తూ సిపిఎం, వివిధ పార్టీలు, దళిత సంఘాల ఆధ్వర్యాన బుధవారం చేపట్టిన 'చలో భీమవరం' కార్యక్రమాన్ని పోలీసులు ఉద్రిక్తంగా మార్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు సహా 151 మందిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. నాలుగురోజుల కిందటే 'చలో భీమవరం' కార్యక్రమానికి పిలుపు ఇచ్చినా నోరు విప్పని పోలీసులు చివరి నిమిషంలో సభకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు యత్నించారు. మంగళవారం సాయంత్రం నుంచే భీమవరం, గరగపర్రులో భారీసంఖ్యలో పోలీసులు మోహరించారు. సభా ప్రాంగణమైన భీమవరం పాత బస్టాండ్ వద్ద వందలాదిమంది పోలీసులు మోహరించి, ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గరగపర్రు నుంచి దళితులంతా ర్యాలీగా...
రాయలసీమ కరువు నివారణచర్యలు తీసుకోవాలని కోరుతూ వామపక్షాల ఆద్వర్యంలో కడపలో శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేశారు.రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదని , బంద్ నిర్వహిస్తామనగానే జూన్ రెండు నుంచి ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. హామీల అమలు మాటలలో కాకుండా చేతల్లో చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాల్సిన అవసరముందని, కరువు సహాయక చర్యలు తక్షణం చేపట్టాలని , అదే విధంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీనివ్వాలని మధు డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర సామాజిక, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైందని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది కార్యకర్తలు తెలంగాణాలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం తరలి వెళ్లారు. జిల్లాలోని పోలవరం డివిజన్ నుంచి వచ్చిన గిరిజన యువకులు విల్లంబులు చేతబూని, డప్పు వాయిద్యాలతో మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.
పోలవరం ప్రాజెక్ట్ కు ఒక న్యాయం, గండికోట ప్రాజెక్ట్ కు మరొక న్యాయమా అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గండికోట ప్రాజెక్ట్ కూడా పోలవరం ప్రాజెక్ట్ మాదిరే ఆంధ్రప్రదేశ్లో ఉందని , ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం చౌటపల్లె గ్రామస్థులు, గండికోటనిర్వాసితులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా ఆందోళన కొనసాగింది. ముంపునకఁ గురైన గ్రామాలకఁ చెందిన ప్రజలతో ధర్నా వద్ద మధు మట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ కింద ని ర్వాసితులకఁ రూ.10 లక్షలు పరిహారం ఇచ్చారని ,...
కొల్లేరు కాలుష్యానికి కారణం పరిశ్రమలే కారణం.ముంపుకి కారణం సరైన ఛానలైజేషన్ లేదు.జబ్బు ఒకటైతే ప్రభుత్వం వేరే మందు వేసింది. ప్రజల జీవితాలను నాశనం చేసింది.కొల్లేరు కాంటూరు 5 నుండి 3 కి కుదించి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాల్సిందే..ప్రజాభేరి పాదయాత్ర లో భాదితులనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి..
పెద్ద నోట్ల రద్దు చేసి ప్రజలను ఎనలేని ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రధాని మోడీ నియంతృత్వ ధోరణిని నిరసిస్తూ చేపట్టిన హర్తాళ్ రాష్ట్రంలో విజయవంతమైంది..హర్తాళ్కు వివిధ వర్గాల ప్రజల నుంచి స్వచ్ఛంద మద్దతు లభించింది. ప్రభుత్వం ఒత్తిడి పెంచినప్పటికీ విద్యా, వ్యాపార సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా సహకరించారు. పోలీసులు నిరసన ప్రదర్శనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలను మూసివేశారు. వాణిజ్య, విద్యాసంస్థలూ మూతపడ్డాయి.
నాన్ షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్డ్ లో చేర్చాలని, గ్రానైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దుచేయాలని, స్ధానిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విశాఖ జిల్లా వి.మాడుగుల తహశీల్ధార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన సీపీఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు.. ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది సీపీఎం నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. న్యూక్లియర్ ప్లాంట్తో కలిగే నష్టాలను వివరించేందుకు.. ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు కొవ్వాడ అణు విద్యుత్ ప్రాజెక్ట్ బాధిత ప్రాంతాల మీదుగా సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నర్సింగరావు అన్నారు. అక్రమ...
ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణంపై సమావేశాలు ఏర్పాటు చేస్తారేగానీ ముంపు మండలాల గిరిజనుల ఘోష మాత్రం పట్టించుకోవడం లేదు. 2018 లోగ పోలవరం పూర్తీ చేస్తామంటున్న ప్రభుత్వం ఏడుమండలాల ప్రజలకు ప్యాకేజి,పునరావాసం కల్పించకుండా వారిని జలసమాధి చేయాలని చూస్తోందని విలీన మండలాల సమగ్రాభివృద్ధి కొరకు చేపట్టిన పాదయాత్రలో రాష్ట్ర సర్కార్ పై మండిపడిన భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిడియం బాబురావు తదితరులు..
తూర్పుగోదావరి జిల్లా దానవాయిపేట నుంచి దివీస్ కంపెనీని తొలిగించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు.కంపెనీని తొలగించకపోతే చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.తొండంగి మండలం దానవాయిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా దానవాయిపేటలో సీపీఎం నిర్వహించతలపెట్టిన సభను పోలీసులు అడ్డుకున్నారు. సీపీఎంరాష్ట్ర కార్యదర్శి మధుతోపాటు 200 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కనిపిస్తున్న కాకినాడ స్మార్ట్ సిటీ వాసుల సమస్యలపై సీపీఎం ఉద్యమం ప్రారంభించింది. ప్రజా సమస్యల సాధన కోసం పాదయాత్ర సాగిస్తోంది. కాకినాడలో ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు బేబీరాణి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దళిత సంఘాల నేతలు రామేశ్వర రావు సహా పలువురు మద్ధతు తెలిపారు.నగరంలోని దళిత, మత్స్యకార పేటల్లో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు పాదయాత్ర నగరంలోని అన్ని డివిజన్లలోనూ సాగుతుందన్నారు.