మహాజన పాదయాత్రకు సంఘీభావం..

తెలంగాణ రాష్ట్ర సామాజిక, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైందని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది కార్యకర్తలు తెలంగాణాలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం తరలి వెళ్లారు. జిల్లాలోని పోలవరం డివిజన్‌ నుంచి వచ్చిన గిరిజన యువకులు విల్లంబులు చేతబూని, డప్పు వాయిద్యాలతో మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.