January

ప్రైవేటువర్సిటీ చట్టం..గెజిట్‌

ప్రైవేటు యూనివర్సిటీలు ( ఎస్టాబ్లిష్‌మెంట్‌ రెగ్యులేషన్‌ ) బిల్లు - 2015ను గెజిట్‌లో ప్రచురణ నిమిత్తం ప్రభుత్వం జీవో నెం.3 ను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 22న శాసన సభలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు - 2015 ప్రవేశపెట్టింది. గ్రీన్‌ఫీల్డ్‌ ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా ప్రపంచ స్థాయి విద్యా విధానం అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు గవర్నర్‌ ఈఎల్‌ నరసింహన్‌ ఈ నెల 8న ఆమోదం తెలిపారు. దీంతో బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు గాను న్యాయశాఖ సోమవారం జీవో నెం.3ను విడుదల చేసింది. 

విశాఖ ఏజెన్సీలో ఉక్కుపాదం..

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా బాక్సైట్‌ వ్యతిరేక గొంతులను నొక్కేస్తోంది. భవిష్యత్‌లో బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా గిరిజనులను భయభ్రాంతులకు గురిజేస్తోంది. అక్రమ కేసులు బనాయించి నిర్బంధం ప్రయోగిస్తోంది. జర్రెల మాజీ సర్పంచ్‌ సాగి వెంకట రమణను హత్య చేసిన మావోయిస్టులకు సహకరించారన్న సాకును చూపించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. 

ఇష్టారాజ్యంగా ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లు

క్రమబద్ధీకరణ ముసుగులో రాజధాని అమరావతి ప్రాంతంలోని వేలాది ఎకరాల అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.అనేక మంది పెద్దలు వేలాది ఎకరాల అసైన్డు భూములను కొనుగోలు చేస్తున్నారని, ప్రమాదకరమైన ఈ కుంభకోణం త్వరలో వెలుగులోకి వస్తుందని రామకృష్ణ తెలిపారు. అసైన్డ్‌ భూముల చట్ట ప్రకారం ఎవరికైనా ఒకసారి భూమిని ప్రభుత్వం ఇస్తే దాన్ని వారు అమ్మటంగానీ, వేరెవరైనా కొనటంగానీ చేయకూడదన్నారు. అందుకు భిన్నంగా క్రయ విక్రయాలైన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యత్నించటం శోచనీయమన్నారు.

గిరిజన చట్టాలకు తిలోదకాలు..

ఏజన్సీ ప్రాంతాల్లో పటిష్టమైన చట్టాలున్నా వాటిని అమలు చేయకుండా లక్షలాది ఎకరాల ఆదివాసీల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆదివాసీ భూమి హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ భూములను దోచుకోవడంలో ప్రభుత్వానికి చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటివేవీ పట్టడం లేదన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా గ్రామసభల తీర్మానాలుండాలన్నారు. ప్రభుత్వం భూ బ్యాంకుల పేరుతో మరణ శాసనం రాస్తోందని వ్యాఖ్యాని ంచారు.

26 స్థానాల్లో పోటీకి సీపీఎం సిద్ధం

స్వచ్ఛ హైదరాబాద్‌-స్వచ్ఛ రాజకీయాలు 'క్లీన్‌ హైదరాబాద్‌-క్లీన్‌ పాలిటిక్స్‌' అనే నినాదంతో జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యు), లోక్‌సత్తా, ఎంబీసీ జాక్‌, కాలనీ సొసైటీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింగరావు తెలిపారు. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, ఇప్పటికే 60 స్థానాల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ 60 డివిజన్లలో లోక్‌సత్తా 21, సీపీఎం 26, సీపీఐ 12, ఎంసీపీఐ (యు) ఒక స్థానంలో పోటీ చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. 

పాక్ విష్యంలో మోడీ వైఖరేంటి?:ఏచూరి

పాకిస్తాన్‌తో చర్చల విషయంలో మోడీ ప్రభుత్వం కుప్పిగంతులు వేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం చర్చల నుంచి వెనక్కి పోయిందని, ఆ తర్వాత అప్ఘనిస్తాన్‌ నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రధాని మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో దిగారని గుర్తుచేశారు. పఠాన్‌కోట్‌ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం చర్చల విషయంలో ఎలాంటి వైఖరిని అను సరించబోతున్నారని మోడీని ప్రశ్నించారు. ఇలాంటి విదేశాంగ విధానం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 

డీజిల్‌ ధర తగ్గించాలని డిమాండ్‌ జనవరి 22న నిరసనలు

డీజిల్‌ రేట్లు తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 22న నిరసన కార్యక్రమాలు చేపట్టి, మార్చి 1న చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన్నట్లు ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన ్‌(ఎఐఆర్‌టి డబ్ల్యూఎఫ్‌) తెలిపింది.

ఫిబ్రవరి 15న చలో పార్లమెంట్‌

ఐసిడిఎస్‌కోసంఐక్యపోరాటం
-సంఘాన్నిచీల్చేయత్నాలు
-9నరైతులు,కార్మికులఆందోళనకుమద్దతు
-మార్చి1నప్రభుత్వదిష్టిబొమ్మలదహనం
-ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌బహిరంగసభపిలుపు
- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ బహిరంగసభ పిలుపు

ఇక భూసేక'రణమే'!

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఆరునూరైనా సర్వే చేయాలని అధికారులను ఉసుగొలిపింది. దీంతో, సోమవారం నుంచి సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో సర్వేలు చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టడం దుర్మార్గం

రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారిశుధ్య కార్మికుల తొలగింపునకు దారితీసే 279 నెంబరు జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్‌ వ్యవహారాల మంత్రి నారాయణకు ఒక లేఖ రాశారు.

Pages

Subscribe to RSS - January