ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు..

సామాజిక న్యాయం అమలు కావాలంటే ప్రయివేటురంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిఎస్‌ఎంఎం (దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌) జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.పాలకులు అవలంబిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో రోజురోజుకీ ప్రభుత్వ రంగం తీసికట్టుగా మారుతోందని, ఫలితంగా ప్రయివేటురంగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం అమలు అసాధ్యంగా మారిందన్నారు. ప్రయివేటురంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయం కొంతైనా సాధించే అవకాశముందని, ఆ దిశగా పాలకులు ఆలోచించాలని కోరారు.