పరువునష్టంపై కేజ్రీ ఘాటుగా..

తనపై జైట్లీ వేసిన పరువునష్టం దావాపై కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. సుమారు 2 వేల పేజీలతో కూడిన సమాధాన పత్రాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. అనంతరం కమల నేతపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు. పరువు నష్టం దావా వేసిన వ్యక్తికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని మీడియా ముందే జైట్లీ పరువు తీశారు. ఆయనకు పరువు ఉంటే కదా..! పరువు నష్టం కేసు వేయడానికి, తనను తాను కాపాడుకోవడానికే... తనపై ఈ కేసు వేశారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌లో లక్ష ఓట్ల తేడాతో జైట్లీ ఓడిపోయారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం, ప్రతిష్టలు ఉన్నాయని జైట్లీ చెప్పుకొంటున్నదంతా అల్పమైన వాదనేనని కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ప్రజల్లో తనకు గొప్ప వ్యక్తిత్వం ఉందని జైట్లీ చేసిన వాదనను భారత ప్రజాస్వామ్యం ఎన్నడూ అంగీకరించలేదని ఢిల్లీ సీఎం అన్నారు.