December

పరిశ్రమల కాలుష్యంపై పోరాటం..

కొల్లేరు కాలుష్యానికి కారణం పరిశ్రమలే కారణం.ముంపుకి కారణం సరైన ఛానలైజేషన్ లేదు.జబ్బు ఒకటైతే ప్రభుత్వం వేరే మందు వేసింది. ప్రజల జీవితాలను నాశనం చేసింది.కొల్లేరు కాంటూరు 5 నుండి 3 కి కుదించి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల భూమి ఇవ్వాల్సిందే..ప్రజాభేరి పాదయాత్ర లో భాదితులనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వైవి..

చర్చకు రానున్న రిచా వివాదం

అలహాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం అధ్యక్షురాలు రిచాసింగ్‌ విశ్వవిద్యాలయ అధికారుల అణచివేత ధోరణులపై ధ్వజమెత్తారు. రిచాసింగ్‌ ఈ వర్సిటీలో అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళ. ఏబీవీపీ ప్రత్యర్థి రజ్‌నీశ్‌ కుమార్‌ సింగ్‌ను ఓడించి రిచాసింగ్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. విశ్వవిద్యాలయంలో జరిగే కార్యకలాపాలన్నింటిలో ఆమె ముందున్నారు. తాను విశ్వవిద్యాలయ అధికారుల తప్పుడు నిర్ణయాలకు, హిందూత్వ శక్తుల ఆగడాలకు అడ్డు నిలవడం వల్లనే తనపై పలు రూపాల్లో దాడి చేస్తున్నారని రిచా అన్నారు. పార్లమెంటులో రిచా వివాదం చర్చకు రానున్న నేపధ్యంలో కేంద్రప్రభుత్వం దిక్కు తోచని పరిస్తితులో పడింది..

 

నీరోలా మారిన నారా:రఘువీరా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూస్తుంటే నీరో చక్రవర్తి తీరు గుర్తుకు వస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకాలు కృష్ణా, పెన్నా డెల్టాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Pages

Subscribe to RSS - December