- ముగ్గురు కార్మికులకు గాయాలు
- ఆందోళనలో కార్మికులు, స్థానికులు
- సంఘటనాస్థలాన్ని పరిశీలించిన సిపిఎం, సిఐటియు నేతలు
- దివీస్ ప్రమాదఘటనపై సమగ్రదర్యాప్తు సిపిఎం, సిఐటియు డిమాండ్
విశాఖ జిల్లా భీమిలి మండలం చిప్పాడ దివీస్ లేబొరేటరీస్లోని హెచ్ బ్లాక్లో బుధవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. రియాక్టర్లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తి, రా మెటీరియల్ లోడ్ చేస్తుండగా నిప్పురవ్వలు ఎగసిపడి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గణపతి, భాస్కర్, అసిరినాయుడు అనే ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి...
District News
సబ్బవరం మండలం వంగలి సర్వేనెంబర్ 109, 135, 240, 241, 242లోగల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న డిమాండ్ చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు సంబంధించి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన భూహక్కుదారుల జాబితా తప్పుల తడకగా ఉందన్నారు. హక్కుదారులలో కొంతమందికి ఐదు ఎకరాల సాగు భూమి ఉండగా 2, 3 ఎకరాలు ఉన్నట్లుగా చూపిస్తున్నారని తెలిపారు. మరికొంత మంది హక్కుదార్ల పేర్లు జాబితాలో లేవన్నారు. 30 ఏళ్లుగా సాగుచేస్తున్న రైతుల ఆమోదం లేకుండా భూ సేకరణ చేయడం సరికాదన్నారు....
ప్రజా ఉద్యమం తప్పదు : సిపిఎం
ప్రభుత్వం మొండిగా వ్యహరించి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొనేందుకు సిద్ధపడితే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం నక్కపల్లి డివిజన్ కన్వీనర్ ఎం.అప్పలరాజు హెచ్చరించారు. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం గ్రామ సభలు పెట్టి ప్రభుత్వం తన ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేశారు. సామాజిక ప్రభావ నివేదికను బహర్గతం చేయాలన్నారు. అవేమి లేకుండా ప్రభుత్వ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు.
విశాఖ-చెన్నై ఇండిస్టియల్ కారిడార్ కోసం ప్రభుత్వం మొండిగా వ్యవహరించి రైతుల నుంచి...
జూన్ 19న రాష్ట్రవ్యాప్త కార్మిక ఐక్య ర్యాలీ
టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా కార్మికులకు ఎటువంటి లబ్ధీ చేకూర్చలేదని, కార్మిక వ్యతిరేకతే అజెండాగా చంద్రబాబు పనిచేస్తున్నారని సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎంఎ గఫూర్ తెలిపారు. సోమవారం విశాఖలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వసూళ్ల మంత్రిగా, యాజమాన్యాల తొత్తుగా ఉన్నారే తప్ప, కార్మిక సమస్యలపై ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని పేర్కొన్నారు. కార్మికులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వటం లేదని మండిపడ్డారు. యూనియన్లు వద్దంటూనే...
చోడవరం సుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అవినీతి బాధ్యత వహించి పాలకవర్గం రాజీనామ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. హుదూద్ తుపాన్ పంచదార అమ్మకాల్లో ఫ్యాక్టరీలో చోటు చేసుకొన్న అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు. హుదూద్ తుపాన్లో రూ.100 కోట్లు నష్టం వచ్చినట్లు అప్పట్లో సుగర్స్ చైర్మన్ చెప్పారని, వెనువెంటనే అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంత నష్టం వాటిల్లలేదని, నష్టంపై స్పష్టత లేదని తెలిపారు. పంచదార అమ్మకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చేపట్టిన విచారణ కేవలం ఇన్సూరెన్స్ నేపథ్యంలోనే జరిగిందని చెప్పారు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి పంచదార అమ్మకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు....
విశాఖ మన్యంలోని బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 97ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్ చేశారు. చంద్రబాబునాయుడు బాక్సైట్ విషయంలో కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జిఒలను రద్దు చేసి తను జారీ చేసిన జిఒ 97ను మాత్రం రద్దు చేయడం లేదని తెలిపారు. ఏదైనా జిఒ జారీ అయితే ఐదేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని, ఆ తర్వాత ఆ జిఒ ఆటోమెటిక్గా రద్దవుతుందని చెప్పారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆటోమెటిక్గా రద్దయ్యే జిఒలను రద్దు చేసినట్లు చంద్రబాబు చెబుతూ గిరిజనులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు....
నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నుల మదింపులోనూ, డివిజన్ల ఏర్పాటులోనూ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తక్షణమే దర్యాప్తు జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్ నోటీసులు ఇవ్వకుండా అపరాధ రుసుము వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. పన్నుల తగ్గింపునకు కృషి చేస్తానని, అపరాధ రుసుము కట్టనవసరం లేదని మంత్రి అయ్యన్నపాత్రుడు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరారు. మున్సిపల్ కౌన్సిలర్లు కూడా ప్రజల పక్షాన ఉండి పన్నులు తగ్గింపునకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు భరించలేని విధంగా పన్నులు పెంచి, అపరాధ రుసుముతో కట్టాలని మున్సిపల్ అధికారులు బెదిరింపులకు దిగడం దుర్మార్గమని, తక్షణమే బెదిరింపులు ఆపాలని...
స్మార్ట్సిటీ వలన కలిగే ప్రయోజనాలకు ప్రతి ఫలంగా జివిఎంసి ఆస్ధిపన్నుపై 10 శాతం అదనంగా స్మార్ట్సిటీ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ప్రతిపాదను నగర టాక్స్ పేయర్స్కు తీవ్ర హాని చేస్తుందని సిపిఐ(ఎం) అభిప్రాయపడుతున్నది. స్మార్ట్సిటీలో అనేక ప్రాజెక్టులను పిపిపి పేర అధికార పార్టీ నాయకులు బినామీ సంస్థలకు ధారాదత్తం చేయుటకు పలు ప్రతిపాదనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వివిధ స్కీము క్రింద మంజూరయ్యే నిధులన్నీంటిని స్మార్ట్ ఏరియా ప్రాంతమైన ఆర్.కె బీచ్ ఏరియాకి మల్లించే ప్రతిపాదను చేశారు. ఈ నిర్ణయాలు అత్యంత వివక్షతతోను, బాధ్యతా రహితంగా ఉన్నాయి. స్మార్ట్సిటి...
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కు సంఘం రాష్ట్ర మహాసభలు మార్చి 27వ తేదీన విశాఖనగరంలో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం - పౌరహక్కులు అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్ను జయప్రదం చేయాలని ఈ రోజు (24-03-2016) పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో విశాఖ బార్ కౌన్సిల్ అధ్యక్షులు కె.ఎస్. సురేష్ కుమార్, ఐలూ నాయకులు ఎన్. హరినాధ్, ఎ.కె.ఎన్ మల్లేష్, ఐ.ఎ.ఎల్ నాయకులు వెంకటేశ్వరరావు, సాయికుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు ప్రసంగించారు.
భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కులను కాపాడవలసిన భాద్యత ప్రభుత్వాలపై ఉన్నది. కాని ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌరహక్కులను కాపాడటంలో...
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల విషయంలో గిరిజనుల మనోభావాలను గౌరవిస్తామని చెబుతున్న చంద్రబాబు, దానికి సంబంధించిన జిఒ 97ను రద్దు చేయకుండా కపట నాటకం ఆడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18న జరిగిన రాష్ట్ర మంత్రివర్గంలో బాక్సైట్కి సంబంధించి రాజశేఖరరెడ్డి ప్రభుత్వ కాలం నాటి, కాలం చెల్లిన 222, 289 జిఒలను రద్దు చేసి గొప్పగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం మరోసారి గిరిజనులను మోసం చేస్తోందని, నిజంగా చిత్తశుద్ధి, గిరిజనుల మనోభావాల మీద గౌరవం వుంటే జర్రెల బ్లాక్లో 1212 హెక్టార్ల బాక్సైట్ తవ్వకాలకు ఎపిఎండిసికి లీజుకిస్తూ 2015 నవంబర్ 5న విడుదల...