సిపిఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర విభజనను కోరాయని, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ గొంతు చించుకుంటున్న చంద్రబాబు రెండుసార్లు విభజనకు అనుకూలంగా లేఖలిచ్చారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గుర్తు చేశారు. ఈ విషయాన్ని మరుగుపడేసి, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారంటూ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు.2008 అక్టోబర్ 18, తర్వాత 2012 డిసెంబర్ 27న ప్రణబ్ ముఖర్జీ, సుశీల్కుమార్ షిండేకు చంద్రబాబు ఇచ్చిన లేఖలను బహిర్గతం చేశారు.