District News
తాజా పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ అమలు చేశారు. గవర్నర్ ఆమోదం పొందిన తరువాత కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్ నియామకం కూడా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా? ఏదైనా ఒకటే. కమిషనర్ పదవీ కాలం తగ్గింపు, ఆ వెంటనే తొలగింపు చట్టబద్ధమా, విరుద్ధమా అన్న చర్చ...
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాల్గవసారి దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగాడంబరం తప్ప ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల మెరుగుదలకు సంబంధించిన ఊసే లేదు. మూడు వారాల లాక్డౌన్ గడువు ముగియడంతో, దానిని మరో పందొమ్మిది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సరే. మరి ఈ లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది దినసరి వేతన కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనివారల మాటేమిటి? మోడీ ప్రసంగంలో వీరికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదు. వీరిని ఆదుకునేందుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదు. ఇంతకుముందు ప్రకటించిన 1.7 లక్షల...
నేడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ప్రతి ప్రజాస్వామ్యవాదీ, ప్రతి బడుగు జీవీ, ప్రతి దళితుడూ తమ కోసం జీవిత కాలమంతా పోరాడి, మరణానంతరం కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ మహామనీషిని స్మరిస్తారు. భక్తితో తలచుకుంటారు. ఆయన ఆశయాలకు పునరంకితమౌతారు.
భారత దేశంలో అంబేద్కర్ వేసిన ముద్ర ఎంతటి ప్రభావాన్ని కలిగిస్తోందంటే పాలక వర్గాలు, ఆధిపత్య వర్గాలు సైతం ఈ రోజు అంబేద్కర్కు ఘనంగా నివాళులు అర్పిస్తాయి. అయితే ఇదంతా మాటలకే పరిమితం అయ్యే నాటకం అని వేరే చెప్పనక్కర్లేదు. నిజంగానే ఈ పాలక వర్గాలకి అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మన దేశంలో ఎప్పుడో కుల వివక్ష, కుల పీడన, దాడులు, అత్యాచారాలు నిలిచిపోయి ఉండాలి.
కనీసం ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వైరస్ సృష్టించిన...
ప్రస్తుత కాలపు ప్రపంచీకరణ లోని ప్రధాన వైరుధ్యాన్ని కోవిడ్-19 మహమ్మారి మన కళ్లకు కట్టినట్లు స్పష్టంగా చూపిస్తోంది. ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలకూ, సాధారణ ప్రజల ప్రయోజనాలకూ మధ్య ఉండే మౌలిక వైరుధ్యమే ఇప్పుడు ప్రధానంగా ముందుకొచ్చింది. ప్రపంచీకరణ శకం అంతటికీ ఈ వైరుధ్యమే మౌలికమైనది. ఇప్పుడది స్పష్టంగా ముందుకొచ్చింది.
వరుసగా ఒక్కొక్క దేశం లోనూ ఇది బైటపడుతోంది. మన దేశాన్నే తీసుకోండి. ఒక్కసారిగా పదుల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. లక్షలాది వలస కార్మికులు తమ స్వంత గ్రామాలకు దూరంగా ఇన్నాళ్లూ పనులు చేస్తున్న వాళ్లు కాస్తా ఆ పనులు పోవడంతో కాలి నడకన వెనక్కి బయలుదేరారు. చాలా మంది క్వారంటైన్లో ఉండిపోయారు. వాళ్ల జేబుల్లో చిల్లి గవ్వ లేదు....
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఇసి) నియామక నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అత్యయిక ఆదేశం (ఆర్డినెన్స్) నిరంకుశ ఏకపక్ష చర్య. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, సమయం, సందర్భం లేని దుస్సాహసం. ఎస్ఇసి పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఎ.పి పంచాయతీరాజ్ చట్టం (1994) లోని సెక్షన్ 200ను సవరిస్తూ శుక్రవారం ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆర్డినెన్స్ ఆమోదించి గవర్నర్కు పంపగా, వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ఆ రాత్రే ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్ జీవో, మూడేళ్ల కాలపరిమితి ముగిసిందంటూ ఎస్ఇసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తొలగిస్తూ మరో జీవో జారీ అయ్యాయి. తెల్లవారి శనివారం పొద్దున పొద్దున్నే కొత్త ఎస్ఇసిగా మద్రాస్...