2017

రాష్ట్ర బంద్ కు సిపిఎం మద్దతు

రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన..విభజన హామీలు అమలుపరచాలని కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, జనసేన, వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. సోమవారం ఉదయం నుండే బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార సంస్థలు మూసివేశారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండే నేతలు పలు బస్టాండుల ఎదుట బైఠాయించడంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. దీనితో ప్రజా రవాణా స్తంభించి పోయింది.

ఏపి ప్రత్యేక హోదా సాధనకై పాదయాత్ర

 ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా సిపిఎం,సిపిఐ,జనసేన ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు . వైసిపి, టిడిపి చేసే పోరాటాల్లో చిత్తశుద్ధి లేదని చెప్పారు. మేం నిజాయితీగా పోరాటం చేస్తున్నామని, కార్యకర్తలతో ఉద్యమం తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు మ‌ధు, రామ‌కృష్ణ‌ మాట్లాడుతూ  21 రోజులుగా పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాసానికి ప్రయత్నిస్తుంటే బిజేపి అడ్డుకుంటు వస్తోందన్నారు. ప్రజా క్షేత్రంలో అవిశ్వాసం పెట్టె హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు బిజెపిపై విశ్వాసం లేదన్నారు.

Pages

Subscribe to RSS - 2017