October

ఉగ్రవాదానికి మూలాలెక్కడ ?

ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్‌ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.

సిపిఎంపై ఆరెస్సెస్‌ తప్పుడు ప్రచారం

కేరళ ఉత్తర ప్రాంతంలో హింసారాజకీయాలకు పాల్పడుతున్న ఆరెస్సెస్‌ తమ కార్యకర్తలను సిపిఎం హత్య చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేయటం విడ్డూరంగా వుందని సిపిఎం పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కార్యకర్తలపై సిపిఎం దాడులు చేస్తోందంటూ తెలంగాణాలోని హైదరాబాద్‌లో ఆరెస్సెస్‌ అఖిల భారత కార్యకారి మండల్‌ సమావేశంలో ఆమోదించిన తీర్మానాన్ని పొలిట్‌బ్యూరో తప్పుపట్టింది. వాస్తవ పరిస్థితులకు, తీర్మానానికి భారీ వ్యత్యాసం వుందని తెలిపింది.

అమెరికా ఆంక్షలకు భయపడం

రష్యా ప్రభుత్వాన్ని బెదిరించేందుకు అమెరికా ఆంక్షల ఆస్త్రాన్ని ప్రయోగించిన పక్షంలో వాటిని ఎదుర్కొనేందుకు తమ దేశం అన్ని విధాలా సంసిద్ధమై ఉందని మాస్కో ప్రభుత్వం ప్రకటించింది. రష్యా ఆర్ధిక శాఖ డిప్యూటీ మంత్రి సెర్జీ ర్యబ్‌కోవ్‌ తమ ప్రభుత్వ సన్నద్ధతను వెల్లడిస్తూ అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి తమ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలను సిద్ధం చేస్తున్నారని, అమెరికా స్పందనకు తగినట్టుగా రష్యా కూడా ప్రతిస్పందన చర్యలు తీసుకోగలదని ఆయన స్పష్టంచేశారు. 

విజయవాడ 31వ డివిజన్‌లో ప్రజా చైతన్య పాదయాత్ర

విజయవాడ కొండ ప్రాంతాల్లోని ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తానని ఎన్నికల సమయంలో చేసిన హామీని అమలు చేయాలని కోరుతున్న కమ్యూనిస్టులపై చంద్రబాబు అవకులు చెవాకులు పేలుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు.31వ డివిజన్‌ తల్లీపిల్లల సంరక్షణా వికాస కేంద్రం వీధిలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజినీ, ఆ డ్రైనేజీలోనే మంచినీటి పైపులైన్లు ఉండటాన్ని పరిశీలించారు. ఏసురత్నం వీధి కొండ ప్రాంత ప్రజలతో మాట్లాడిన సందర్భంలో మహిళలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరోప్రమాదం

నెక్కంటి ఆక్వా ఫ్యాక్టరీలో మరో సారి ప్రమాదం సంభవించింది.గ్యాస్ లీక్ అయి 27మంది కార్మికులు తీవ్రంగా అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. వీరింకా డిశార్జ్ కాకముందే మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం అస్వస్థతకు గురయినవారికి న్యాయం చేయాలని ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు.

Pages

Subscribe to RSS - October