June

జీఎస్‌టీపై అభ్యంతరాలు చెప్పిన జయ

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై తమకున్న అభ్యంతరాలను జయలలిత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియజేశారు. పరిహారం చెల్లించే కాలవ్యవధి, పన్ను పరిధిలో ఉండని వస్తువులు తదితర అంశాలపై విస్తృత ఏకాభిప్రాయం కోసం కేంద్రప్రభుత్వం కృషి చేయాలని సూచించారు. తమిళనాడు వంటి తయారీరంగ, ఎగుమతి ఆధారిత రాష్ట్రాలకు జీఎస్‌టీ వల్ల ఆదాయంలో పెద్దఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందని జయ పేర్కొన్నారు.

మీరు అధికారంలో ఉన్నపుడు ఏం చేశారు..

మాజీ కేంద్ర మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి టీడీపీ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెడుతున్నారని, వీళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మొండి వైఖరి వీడాలని కోరారు. 

SBIలో SBH విలీనం ఆపాలి:CPM

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌)ను విలీనం చేసే ప్రక్రియను తక్షణమే ఆపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులన్నింటిలో అగ్రగామిగా నిలిచి రాష్ట్రంలో రూ.2.50 లక్షల కోట్ల టర్నోవర్‌ కలిగిన ఎస్‌బీహెచ్‌ను విలీనం కాకుండా రక్షించుకోవడం చారిత్రక అవసరమని తెలిపారు. 

గుజరాత్‌లో దళితుల ఆత్మహత్యలు..

 దేశంలోని ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న మొత్తం ఆత్మహత్యలతో పోలిస్తే గుజరాత్‌లో దళితులు ఆత్మహత్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఈ గణాంకాల మేరకు గుజరాత్‌లో ప్రతి లక్ష మంది జనాభాలో 11.7 శాతం మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వీరిలో ఆత్మహత్యకు పాల్పడుతున్న దళితులు18.7 శాతం మంది ఉన్నారు.

ద్రవ్యోల్బణం 0.79% పెరిగింది...

కూరగాయల ధరలు ఒకేసారి రెండంకెల స్థాయిలో పెరగడంతో మే మాసంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 0.79శాతం పెరిగింది. దీంతో సరఫరా విభాగంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించ డానికి విధానపరమైన చర్యలను పారిశ్రామిక రంగం చేపట్టాల్సి వస్తోంది. అటు టోకు, ఇటు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడంతో పారిశ్రామిక ఉత్పత్తి మందగించినప్పటికీ భారత రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లలో కోత విధించడంలో జాప్యం చేయవచ్చునని భావిస్తున్నారు.

లక్షన్నర ఎకరాలకు సాగునీరు సరఫరా చేయొచ్చు

 పోలవరం ఎడమ కాలువకు ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని పంపించడానికి అవకాశామున్న పుసుషోత్తపట్నం ప్రాంతం, కాతేరు, పుష్కర ఎత్తిపోతల పథకాలను సిపిఎం బ్రందం పరిశీలించింది. ఈ సందర్భంగా అధ్యయనం బ్రందం తొలి దశలో ఎడమ కాలువ పనులు 58కిలో మీటర్లు వరకు పూర్తిచేసి ఏలేరు నదిలోకి విడిచిపెట్టి ఏలేరు రైతుల ఆయకట్టు 70వేల ఎకరాలకు నీరు అందించడం వల్ల ఏలేరు జలాశయంలో మిగలనున్న 10టిఎంసిల నీటిని విశాఖపట్నం తరలించవచ్చని సూచించారు. రెండో దశలో 58కిలో మీటర్లు నుంచి 162 కిలోమీటర్లు ( ఏలేరు రివర్ క్రాసింగ్ నుంచి తాళ్లపాలెం) వరకు ప్రస్తుతమున్న ఏలేరు నీటిని కెనాల్ ద్వారా నీటిని పంపించవచ్చన్నారు.

రూ.10 లక్షలు దాటిన సంస్థలకు జీఎస్‌టీ

వస్తువులు, సేవల అమ్మకంతో పాటు ఆన్‌లైన్‌లో జరిపే కొనుగోళ్లు అన్నింటికీ జీఎస్‌టీ అమలవుతుందని, లావాదేవీ తొలి అంకం (మూలం వద్దే) ఈ పన్ను విధించాలని నమూనా జీఎస్‌టీ చట్టంలో ప్రతిపాదించారు. కోల్‌కతాలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ సమావేశంలో ఈ నమూనా చట్టానికి ఆమోదం తెలిపారు. వార్షిక టర్నోవర్‌ రూ.10 లక్షలు దాటిన సంస్థలకు జీఎస్‌టీ అమలవుతుంది. అదే సిక్కిం సహా ఈశాన్య రాష్ట్రాల్లో అయితే రూ.5 లక్షల టర్నోవర్‌కే విధిస్తారు. ఈ నమూనా జీఎస్‌టీ చట్టాన్ని రాష్ట్రాలు సమావేశం ఆమోదించినట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా వెల్లడించారు

కాలేజీ తరలింపుపై పెల్లుబుకిన ఆగ్రహం

 పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల స్థలంలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు 99 ఏళ్లు లీజుచిచ్చి పట్టణ నడిబొడ్డున ఉన్న కళాశాలను ఊరిచివరకు తరలించడం దారుణమని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు తాలుకా సెంటర్‌లోని గుంటూరు-మాచర్ల ప్రధాన రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోపోగా పేద విద్యార్థులకు అందుబాటులో ఉన్న కళాశాలను తరలించాలనుకోవడం సరికాదన్నారు.

గుల్బర్గ్‌ కేసులో తీర్పు 17కు వాయిదా

గుల్బర్గ్‌ అల్లర్ల కేసులో దోషులకు శిక్ష విధించే అంశంపై జరుగుతున్న విచారణను ప్రత్యేక న్యాయస్థానం 17కు వాయిదా వేసింది. 2002లో గుజరాత్‌లోని గుల్బర్గ్‌లో జరిగిన మారణకాండకు సంబంధించి కోర్టు ఇటీవల 24 మందిని దోషులుగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. వీరికి శిక్ష ఖరారు అంశంపై విచారణ జరుపుతున్న కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. 

త్రిపుర విభజన ప్రసక్తే లేదు..

గిరిజనుల పార్టీ ఇండీజనెస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపీఎఫ్‌టీ) లేవనెత్తిన ప్రత్యేక రాష్ట్రం 'త్రిప్రా ల్యాండ్‌' డిమాండ్‌ను త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలు తిరస్కరించాయి. పాలక సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి విజన్‌ ధర్‌ మాట్లాడుతూ విచ్ఛిన్నకరమైన, బాధ్యతారాహిత్యం, రాజకీయ దురుద్దేశంతో కూడిన ఈ డిమాండ్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అసలే చిన్న రాష్ట్రమైన త్రిపురను ఇంకా విభజించాలన్న ఈ డిమాండ్‌ తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అన్నారు.

Pages

Subscribe to RSS - June