July

భారత పత్రికారంగం భవిష్యత్తేమిటి?

             అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్‌ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్‌ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది.

రాజకీయ దురహంకారం..

         మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం? ఏ అహంకారాల అభిజాత్యాల జాతరలో కొట్టుకుపోతున్నాం? మనం చూస్తున్నదంతా నిజమేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమకపడతాం. నిజమే గాంధీజీలాంటి మహానుభావుల, బుద్ధుడు, క్రీస్తులాంటి వారి పునరుత్థానం కూడా జనంలో ఇంత ఆనందాతిశయాన్ని రేకెత్తిస్తుందో, లేదో అనుమానమే. జైలు నుంచి మన నాయకుల పునరుత్థానం మాత్రం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్సవంగా మారిపోయింది. పునరపి జైలు..

ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.

పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ..

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు స్వర్ణాంధ్ర పి`4 ఫౌండేషన్‌ ఛైర్మన్‌కి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 30 జూలై, 2025.

 

శ్రీ సిహెచ్‌.కుటుంబరావు గారికి,

వైస్‌ ఛైర్మన్‌, స్వర్ణాంధ్ర పి-4 ఫౌండేషన్‌,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: పి-4 పేరుతో టీచర్లు, సచివాలయ ఉద్యోగులను దత్తత తీసుకోవాలని ఇచ్చిన మెమోలపై వాస్తవాలు వివరించాలని కోరుతూ...

అయ్యా!

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జూలై, 2025.

ఆగష్టు 3న విఎస్‌ అచ్యుతానందన్‌ సంతాప సభ విజయవాడలో

సిపిఐ(యం) పోలిట్‌బ్యూరో పూర్వ సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్‌.అచ్యుతానందన్‌ సంస్మరణ సభ 03.08.2025వ తేదీన సాయంత్రం 5 గంటలకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం (విజయవాడ)లో జరుగుతుంది. వి.ఎస్‌.అచ్యుతానందన్‌ జూలై 21న అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 28 జూలై, 2025.

 

లులు కంపెనీకి విలువైన ప్రభుత్వ/ఆర్టీసి 

భూములు కట్టబెట్టే జివో 137 రద్దు చేయాలి

విశాఖలో 13.83 ఎకరాలు ప్రభుత్వ భూములను, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళజాతి సంస్థ లులుకి కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. లులును ప్రోత్సహించడమంటే వేలాది మంది చిన్న వ్యాపారులను, లక్షలాది మంది ఉపాధిని దెబ్బకొట్టడమే.

పి - 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టకండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2025.

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి.. అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 27 జూలై, 2025.

 

కరేడులో పోలీసు నిర్బంధాన్ని ఆపాలి

అరెస్ట్‌ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి

- సిపిఎం డిమాండ్‌ 

ఇండోస్సోల్‌ కంపెనీకి బలవంతంగా రైతుల భూములను ధారాదత్తం చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్న రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, దళితులపై పోలీసు నిర్బంధాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం 30(ఎ) యాక్ట్‌ను ఉపసంహరించుకొని అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని కోరుతున్నది.

Pages

Subscribe to RSS - July