July

భారత పత్రికారంగం భవిష్యత్తేమిటి?

             అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ డిజిటల్‌ యుగంలో బాగా అభివృద్ధి చెందిన దేశాలలోని వార్తా పత్రికలూ, సమాచార టెలివిజన్ల భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్‌ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్‌ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ వార్తా పత్రికల మహాసభ, ప్రపంచ సంపాదకుల ఫోరంలలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికారంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచవ్యాప్తంగా అటూ ఇటూగా అందరం నిలకడలేని అనిశ్చితిలోకి అడుగుపెడు తున్నామన్న భావన కలిగింది.

రాజకీయ దురహంకారం..

         మనం ఏ సంస్కృతిలో జీవిస్తున్నాం? ఏ అహంకారాల అభిజాత్యాల జాతరలో కొట్టుకుపోతున్నాం? మనం చూస్తున్నదంతా నిజమేనా? సత్యం కానిదాన్ని సత్యంగా.. సత్యాన్ని అబద్ధంగా అర్థం చేసుకుంటూ అంతా రివర్స్‌ గేర్‌లో నడుస్తున్నామా? రేవంత్‌ మహాశయుడు జైలు నుంచి బెయిల్‌ మీద తిరిగి వచ్చిన సంరంభం చూస్తే ఇప్పుడు ఏ కాలుష్యంలో మనం ఊపిరి పీల్చుకుంటున్నామో బోధపడక చాలా తికమకపడతాం. నిజమే గాంధీజీలాంటి మహానుభావుల, బుద్ధుడు, క్రీస్తులాంటి వారి పునరుత్థానం కూడా జనంలో ఇంత ఆనందాతిశయాన్ని రేకెత్తిస్తుందో, లేదో అనుమానమే. జైలు నుంచి మన నాయకుల పునరుత్థానం మాత్రం అదో అండపిండ బ్రహ్మాండ మహోత్సవంగా మారిపోయింది. పునరపి జైలు..

ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.

విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

 

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,

గౌరవ ముఖ్యమంత్రి,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ (పి.ఆర్‌) ఇవ్వాలని కోరుతూ...

అయ్యా!

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై అఖిల పక్ష సమావేశం జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై నిన్న (జూలై 4) ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖా మంత్రి, అధికారులతో చేసిన సమీక్ష సందర్భంగా ఫ్రీహోల్డ్‌ భూములపై ఇచ్చిన ఆదేశాలు టిడిపి ఎన్నికల హామీలకు భిన్నంగా పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి. పేదల భూములను పెత్తందార్లకు, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చర్యలు ఉన్నాయి. తక్షణమే అఖిల పక్ష సమావేశం జరిపి భూ సమస్యపై సమగ్ర విధానం రూపొందించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 02 జూలై, 2025.

 

బివి పట్టాభిరామ్‌కు సంతాపం

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, అభ్యుదయవాది, రచయిత బివి పట్టాభిరామ్‌ మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నది. ఆయన మృతి తీరనిలోటు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాము. 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 31 జూలై, 2024.

 

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలి

కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సహాయపడతామని ఒకవైపు చెబుతూనే నిజాయితీగా అటువంటి ప్రయత్నమేమీ చేయకపోవడాన్ని  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకుని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

Pages

Subscribe to RSS - July