January

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు.

పారిశుధ్య కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి పురపాలక సంఘం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు ప్రభు త్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజల పై భారాలు చేసే యూజర్‌ ఛార్జీలను విరమించాలన్నారు. 279 ఇఒని రద్దు చేయాలని వారు డిమాండ్‌చేశారు.

కార్మిక వ్యతిరేక జిఒ 279ని రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు.

ర‌వాణా శాఖ ప్రైవేటు

                       అతి కీలకమైన రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని చూస్తోంది. అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రైవేటు రాగం తీస్తున్న చంద్రబాబు ఒక్కొక్క ప్రజా సేవపై వేటు వేస్తూ వస్తున్నారు. తాజాగా రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. బిడ్డింగుల పేరిట బహుళ జాతి సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించాలని చూస్తున్నారు. ముందుగా వాహన సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ చేసి, వాటి బాధ్యతను ఐదు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి కోట్ల రూపాయల భారాలను ప్రజలపై వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

'వంశధార' పనులు నిలిపేయాలి : సిపిఎం

 వంశధార నిర్వాసితులకు పునరావాసం, 2013 ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అప్పటివరకూ పనులు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సీతారామారావును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, వంశధార నిర్వాసిత సంఘం ప్రతినిధి జి.సింహాచలం వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ జలాశయం పనులు చేపట్టి దశాబ్దకాలం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పంచలేదని తెలిపారు.

విశాఖ ' ప్రత్యేక రైల్వేజోన్‌ ' ఏర్పాటు చేయాలి

           విశాఖపట్నం, వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె లోకనాధం, డాక్టర్‌ బి గంగారావు ఆర్‌కెఎస్‌వి కుమార్‌ ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్‌ మేనేజరు రాజీవ్‌ విష్ణోరుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవార స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో జిఎమ్‌ను కలిసి, వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం, 2014లో పేర్కొన్న విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్‌ అంశాన్ని జిఎం దృష్టికి తీసుకెల్లామన్నారు. ఏడాదికి సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భోగాపురంపై హైకోర్టు స్టే..

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని స్పష్టం చేసింది. భూసేకరణ నోటిఫికేషన్‌ రాష్ట్ర గజిట్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. దీనికి భిన్నంగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తుండడాన్ని కోర్టు తప్పు పట్టింది.

ముగిసిన SFI జాతీయ మహాసభలు

దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగు తోందని, దాని కను గుణంగానే విధానాల రూప కల్పన జరుగు తోందని ఎస్‌ఎఫ్‌ఐ 15వ జాతీయ మహాసభ పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడాలని మహాసభ నిర్ణయించింది. సోమవారం రాజస్థాన్‌లోని సీకర్‌ (సుదీప్తో గుప్తా నగర్‌)లో ఎస్‌ఎఫ్‌ఐ 15వ అఖిల భారత మహాసభలు ఘనంగా ముగిసాయి.

భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ ఒప్పందం

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య సంతకాలు జరిగాయి. అయితే వీటి ధరకు సంబందిóచిన ప్రతిష్టంభన ఇంకా అలానే కొనసాగుతోంది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌ (ఐజిఎ) పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

Pages

Subscribe to RSS - January