February

గొట్టిపాడు దళితులకు న్యాయం చేయాలి..

దళితులపై దాడులకు నిరసనగా ఈనెల 23న చలో గుంటూరు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడును మధు ఆధ్వర్యంలో సిపిఎం బృందం శుక్రవారం సాయంత్రం సందర్శించింది. డిసెంబరు 31, జనవరి ఒకటిన దళితులపై పెత్తందార్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దాడికి గురైన దళితులను మధు పరామర్శించిన అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం చేకూరే వరకూ అండగా పోరాటం చేస్తామని ప్రకటించారు. గొట్టిపాడు ఘటనపై ఈనెల 23న రాష్ట్రంలోని దళితులందర్నీ సమీకరించి 'చలో గుంటూరు' నిర్వహిస్తామని ప్రకటించారు.

మహోన్నతుల కోవలో సింహాద్రి శివారెడ్డి

పీడిత వర్గాల తరపున పోరాడే క్రమంలో ఆదర్శనీయ జీవితం గడిపిన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి మహోన్నతుల కోవలోకి సింహాద్రి శివారెడ్డి త్యాగమయ జీవితం చేరుతుందని, పేదల గుండెల్లో ఆయన కలకాలం నిలిచిపోతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు పేర్కొన్నారు. శనివారం మంగళగిరి మండలం కాజ గ్రామంలోని శివారెడ్డి నివాసం వద్ద మంగళగిరి డివిజన్‌ కార్యదర్శి జె.వి.రాఘవులు అధ్యక్షతన శివారెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తనతోపాటు కుటుంబ సభ్యుల్ని, బంధువుల్ని కూడా పీడిత వర్గాల కోసం పని చేసే విధంగా తీర్చిదిద్దటం అత్యంత గొప్ప విషయమన్నారు.

దివీస్ కెమికల్ ఫ్యాక్టరీ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని కోరిన వారిని అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ

మిర్చికి రూ.12 వేల ధర ప్రకటించాలి

క్వింటా మిర్చి కి రూ.12 వేలు, క్వింటా కందికి రూ.7,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. బుధవారం క్రోసూరులోని ఆమంచి భవనంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆవుల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. జరిగింది. పాశం రామారావు మాట్లాడుతూ మిర్చి ఒక ఎకరం పండించడానికి 1.25 లక్షలు ఖర్చవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి పరోక్షంగా రూ.40 వేలు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.12 వేలు ఉన్న మిర్చి క్వింటా ప్రస్తుతం రూ.ఏడు వేలకు పడిపోయింది.

కార్పొరేట్‌ విధానంతో రైతులే కూలీలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులను కూలీలుగా మారుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసదస్సులో పాల్గొనేందుకు బుధవారం నరసరావుపేట వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల పట్ల సిపిఎం జేజేలు పలుకుతుందన్నారు. వేముల రోహిత్‌ ఎస్‌సిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన గుంటూరు కలెక్టర్‌ నేడు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల బీసీనా, ఎస్‌సినా అనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. నిలకడ లేని నష్టదాయక విధానాలు చాలా ప్రమాదకరమని తెలిపారు.

Pages

Subscribe to RSS - February