2021

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణపై ధర్నా

కేంద్ర బడ్జెట్టులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే.శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్రకార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు, అఖిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల.వెంకయ్య, వివిధ రాజకీయ, ట్రేడ్‌ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్పొరేటీకరణ విధానాలను ఖండించారు.

తిరుపతిలో 'రైతు జీవితం' షార్ట్ ఫిల్మ్ ఆవిష్కరణ

 

 తిరుపతి సి.పి.యం.ఆఫీసు నందు 'రైతు జీవితం' షార్ట్ ఫిలిమ్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి (MLC) , ఆర్పీఐ నాయకులు అంజయ్య తదితరలు

Pages

Subscribe to RSS - 2021