2021

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుపై విశాఖలో నిరసన

పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు,మందులు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీల  ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన చేపట్టారు. బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క మే నెలలోనే 22 సార్లు పెంచారని, కరోనా నేపధ్యంలో సామాన్యుల జీవితాలు దుర్బరం అయ్యాయని, ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టకపోగా ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపడం దుర్మార్గమన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని వాపోయారు.

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలకు నిరసన

ఈ నెల రోజుల కాలంలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోలు ధరలను 20 సార్లు పెంచింది. ఫలితంగా డీజిల్ పెట్రోల్ ధరలకు తేడా లేకుండా పోయింది. ప్రజలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తుంటే ప్రజలపై కేంద్ర ప్రభుత్వo భారాలు వేయటం పద్దతి కాదు . డీజిల్ పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన గాని రకరకాల టాక్స్లు వేసి ధరల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా బాధాకరం పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చెసింది.

Pages

Subscribe to RSS - 2021