January

సఫ్దర్‌ ఆశయాలను కొనసాగిద్దాం..

వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ 26వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఢిల్లీ మేథావి వర్గం, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్‌ క్లబ్‌లో 'సఫ్దర్‌ హష్మీ మెమోరియల్‌ ట్రస్ట్‌' ఆధ్వర్యంలో శుక్రవారం పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో నానాటికి పెరుగుతున్న అసహనం, మతోన్మాదంపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ అకట్టుకుంది. మోడీ నిరంకుశ వైఖరిని, మతోన్మాద ఎజెండాను ఈ ప్రదర్శనలో ఎండగట్టారు. దేశంలోని రచయితలు, మేధావులకు మతంరంగు పులిమి హత్యలు చేస్తున్న వైనాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు.

లాలూ,నితీశ్‌ల మధ్య విభేదాలు..

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి.ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముగ్గురు ఇంజినీర్ల హత్యల నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య ఆరోపణల పర్వం మొదలైంది.ఇంజినీర్ల హత్యకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బాధ్యత వహించాలని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రతాప్‌సింగ్‌ అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఇంజినీర్లు హత్యకు గురౌతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆయన నిలదీశారు. 

వారి పోరాట బలం..త్యాగఫలం

అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్‌ అహ్మద్‌, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు.

Pages

Subscribe to RSS - January