District News

మనది లౌకిక రాజ్యం. దాన్ని పునాదులతో సహా ధ్వంసం చేసేందుకు బిజెపి బుల్డోజరు రాజకీయాలను నడుపుతున్నది. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, గుజరాత్‌ తరహా ప్రయోగాలను ఆంధ్రప్రదేశ్‌కు దిగుమతి చేస్తున్నది. రాష్ట్ర ప్రజలు దీన్ని తిప్పికొట్టాలి. ఈ మధ్య కాలంలో శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, శోభాయాత్ర వంటి పేర్లతో భక్తులను సమీకరించి పరమత ద్వేషాన్ని, మైనార్టీ వ్యతిరేకతను నూరిపోసేందుకు ప్రయత్నించారు. రాజకీయ పొత్తు పేరుతో జనసైనికుల్ని పావులుగా మార్చుకుంటున్నది. ఈ యాత్రలలో వైసిపి, టిడిపి నాయకులు కూడా చాలా చోట్ల పాల్గొన్నారు. మతాన్ని రాజకీయాలకు ముడివేసి లబ్ధి పొందాలన్న బిజెపి కుయత్నాలకు వైసిపి, టిడిపిలు కూడా తమ వంతు దోహదపడుతున్నాయి. గత వారం రోజులుగా అమలాపురం ప్రాంతంలో...

ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ(ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
      దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలు గ్రూపులు ఆ యా తరగతుల డిమాండ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు...

భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండే సుసంపన్నమైన మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు అత్యంత దుర్మార్గమైన బుల్డోజర్‌ సంస్కృతిని బిజెపి ముందుకు తేవడం ఆందోళన కలిగిస్తోంది. బిజెపి అనుసరిస్తున్న ఈ ధోరణి చాలా ప్రమాదకరం. రాజ్యం క్రూరత్వానికి, అధికార దుర్వినియోగానికి ఈ బుల్డోజర్‌ సంస్కృతి ప్రతీక. ఏళ్ల తరబడి ఈ నిర్మాణాలున్నా ఏనాడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చింది? అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా , అవి ఏ వర్గానికి చెందినవైనా చర్య తీసుకోవాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన వలస శ్రామికులను, పేదలను ఉపాధికి దూరం చేసి నిలువ నీడలేకుండా చేయడం అమానుషం. మానవ హక్కులకే విరుద్ధం. అక్రమ కట్టడాలను కూల్చాల్సి వస్తే ఢిల్లీలో నాలుగింట మూడొంతులు ఉండవు....

Pages