72వార్డుల్లో పాదయాత్రలు, సభలు, గ్రూపుమీటింగ్లు
ఆగష్టు 12, 14 తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసనలు
లక్షలాది కరపత్రాలు, బుక్లెట్స్తో ప్రచారం.
విశాఖనగరం స్మార్ట్సిటీగా ప్రకటించారు. సామాన్య మద్యతరగతి, పేద ప్రజల సమస్యలు పట్టించుకొనే నాధుడే లేడు. ఫలితంగా నగర ప్రజలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక ప్రపంచబ్యాంకు సంస్కరణలు కూడా శరవేగంగా నగరంలో అమలు చేస్తున్నారు. పౌరసేవలను ప్రైవేటీకరిస్తున్నారు. కొండలు, భూములు, సముద్రతీరం, ఇతర వనరులను విదేశీ, స్వదేశీ కార్పొరేట్సంస్థలకు ధారాధత్తం చేస్తున్నారు. జివిఎంసికి ఎన్నికలు పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో...