రాష్ట్రంలో తెలుగుదేశం, కేంద్రంలో బిజెపి ప్రభుత్వాలు దేశంలోని సహజ వనరులను కార్పోరేట్ శక్తులకు ధారాదత్తం చేసే దుందుడుకుగా వ్యవహరిస్తునాయి . విశాఖ గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలపై గిరిజనులకు , గిరిజన చట్టాలకు కనీసం గౌరవించకుండా ఏకపక్షంగా రాష్ట్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్నది .దీనిపై పార్లమెంట్ లో లేవనెత్తుతానని సిపియం పార్లమెంట్ సభ్యులు జితేంద్ర చౌదరి గారు తెలియజేసారు. బాక్సైట్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసారు.
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంగా బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను రద్దు చేస్తానని, ఈ ఒప్పందాలన్నీ అనైతకమని చెప్పి గిరిజనుల ఓట్లు తో గెలిచారు. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ గిరజనులను...