District News

క్వింటా మిర్చి కి రూ.12 వేలు, క్వింటా కందికి రూ.7,500 మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. బుధవారం క్రోసూరులోని ఆమంచి భవనంలో సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఆవుల ఆంజనేయులు అధ్యక్షత వహించారు. జరిగింది. పాశం రామారావు మాట్లాడుతూ మిర్చి ఒక ఎకరం పండించడానికి 1.25 లక్షలు ఖర్చవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి పరోక్షంగా రూ.40 వేలు పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. సీజన్‌ ప్రారంభంలో రూ.12 వేలు ఉన్న మిర్చి క్వింటా ప్రస్తుతం రూ.ఏడు వేలకు పడిపోయింది. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పప్పు ధాన్యాల వ్యవసాయం...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్‌ విధానాలను అనుసరిస్తూ వ్యవసాయ రంగంలో సన్నకారు రైతులను కూలీలుగా మారుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసదస్సులో పాల్గొనేందుకు బుధవారం నరసరావుపేట వచ్చిన ఆయన స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో విలేకరులతో మాట్లాడారు. భారత శాస్త్రవేత్తలు సాధించిన విజయాల పట్ల సిపిఎం జేజేలు పలుకుతుందన్నారు. వేముల రోహిత్‌ ఎస్‌సిగా సర్టిఫికెట్‌ ఇచ్చిన గుంటూరు కలెక్టర్‌ నేడు కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల బీసీనా, ఎస్‌సినా అనే అంశాన్ని లేవనెత్తుతున్నారన్నారు. నిలకడ లేని నష్టదాయక విధానాలు చాలా ప్రమాదకరమని తెలిపారు. చేతికొచ్చిన మినుము, కంది, పెసర పంటలకు మద్దతు ధర లేక రైతులు...

ఉండవల్లి హరిజనవాడకెళ్లే దారిలో ప్రభుత్వ భూమికి సంబంధించిన స్థలంలో ఇళ్లు వేసుకుంటామని సిపిఎం ఆధ్వర్యంలో పేదలు స్థలాల్లోకి శనివారం చేరుకున్నారు. పుష్కరాల సందర్భంగా తాడేపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇళ్ళస్థలాలిస్తామని హామీనిచ్చి మున్సిపల్‌ అధికారులు, పాలకవర్గం పేదల ఇళ్లు తొలగించారు. నెలలు గడుస్తున్నా పేదలకు స్థలాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఇందుకు ఉండవల్లి హరిజనవాడకెళ్ళే దారిలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, మున్స్పిల కార్యాలయ ముట్టడి చేపసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పేదలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. దీంతో పేదలు సిపిఎం నాయకులతో కలిసి...

పల్నాడు ప్రాంతంలో సిమెంట్‌ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేటాయించిన భూములలో వెంటనే పరిశ్రమలు స్థాపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. మంగళవారం స్థానిక కన్నెగంటి హనుమంతు భవన్‌లో సిపిఎం నాయకులు లేళ్ల లక్ష్మిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన జరిగిన సిపిఎం డివిజన్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ 12సంవత్సరాల క్రితం సిమెంట్‌ఫ్యాక్టరీల కోసం వివిధ ప్రైవేటు సంస్థలు 12వేల ఎకరాలు భూములను పల్నాడు ప్రాంతంలో సేకరించారని ఇప్పటి వరకూ ఒక్కఫ్యాక్టరీ కూడా నిర్మించలేదన్నారు. వెంటనే పరిశ్రమలు స్థాపించి యువకులకు ఉపాధి కల్పించాలని లేని పక్షంలో ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకుని రైతులకు అప్పగించాలని కోరారు. కేంద్రప్రభుత్వం నల్లధనం...

రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కార్మికులకు ఉపాధిపనులు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఎం.రవి, ఆర్‌. చంద్రశేఖర్‌ విమర్శించారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోందని మండిపడ్డారు. సోమవారం సంఘం నాయకులు రాజధాని ప్రాంత గ్రామాలైన పెనుమాక, ఉండవల్లి, కృష్ణాయపాలెం, మందడం, మల్కాపురం, ఐనవోలు, కురగల్లు, నిడమర్రు, బేతపూడి, నవులూరులో పర్యటించారు. మల్కాపురం నర్సరీల్లో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడారు. ఆరు, ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడంలేదని మహిళా కార్మికులు సంఘం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఫారెస్ట్‌ డిపార్టుమెంటు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ అధికారులు...

తెలంగాణ రాష్ట్ర సామాజిక, సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర చారిత్రాత్మకమైందని సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మహాజన పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆ పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వందలాది మంది కార్యకర్తలు తెలంగాణాలోని కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం జమ్మిగూడెం తరలి వెళ్లారు. జిల్లాలోని పోలవరం డివిజన్‌ నుంచి వచ్చిన గిరిజన యువకులు విల్లంబులు చేతబూని, డప్పు వాయిద్యాలతో మహాజన పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు.

యడ్లపాడు మండలంలో దళితులు సాగు చేసుకునే భూములు ఆక్రమణలకు గురయ్యాయని, శ్మశాన స్థలాలు లేక దళితులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సమస్యలపై ఉద్యమించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు. దళితుల సమస్యపై నిర్వహిస్తున్న పాదయాత్ర బుధవారానికి మూడో రోజుకు చేరింది. యాడ్లపాడులో ప్రారంభమైన యాత్ర కారుచోల, ఉన్నవ, వంకాయపాడు, ఉప్పరపాలెం, లింగారావుపాలెం, కొత్తసొలస, పాత సొలస, కొండవీడు, ఛంగీజ్‌ఖాన్‌పేట, సంగం, బోయపాలెం తదితర గ్రామాల్లో దళితవాడల్లో సమస్యలను అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర బృందానికి సమస్యలు వెల్లువెత్తాయి.మండలంలో అనేక గ్రామాలలో దళితులు సాగు చేసుకునే భూములు, శ్మశాన భూములు ఆన్యాక్రాంతమవుతున్నాయి. నీరు చెట్టు పేరుతో...

సామాన్లు సద్దుకుంటామన్నా ఆగకుండా ప్రొక్లేయిన్ల్‌తో మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది ఇళ్లను కూల్చివేయించారని వావిలాలఘాట్‌ వాసులు బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వావిలాల్‌ఘాట్‌ వాసులు సామన్లు సద్దుకుంటుం డంగానే మంగళవారం సాయంత్రం పోలీసులు బందోబస్తుతో మున్సిపల్‌ అధికారులు వారి ఇళ్లను నేల మట్టం చేసిన విషయం విధితమే. వావిలాలఘాట్‌ పార్క్‌ అభివృద్ధికి వావిలాలఘాట్‌లో నివాసం వుంటున్న 102 కుటుంబాల ఇళ్లను పీకివేసి ఎస్‌పిజి డిగ్రీకళాశాల్లో చూపించిన ప్రత్యామ్నాయ స్థలానికి వెళ్లి ఇళ్లు అక్కడవేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ ట్రాక్టర్‌లతో మున్సిపల్‌ సిబ్బంది వారి సామన్లను ప్రత్యేమ్నాయ స్థలంలోకి తరలించి వేశారు. ఈ సందర్బంగా బుధవారం...

దళితుల భూముల జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ టిడిపి నాయకులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. ఒక్కసెంటు కూడా ఇతరులకు పోనివ్వబోమని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లిలో 40 ఏళ్ల కిందట దళితులకు కేటాయించిన 416 ఎకరాల సాగు భూమిని అధికార పార్టీ నాయకులు కాజేయాలని చూస్తున్న నేపథ్యంలో సంబంధిత పొలాలను మధు ఆధ్వర్యంలో శుక్రవారం పరిశీలించారు. ఈ భూములను 1975లో అప్పటి జిల్లా కలెక్టర్‌ కత్తి చంద్రయ్య దళితులను సొసైటీగా ఏర్పాటు చేసి భూమినిచ్చారు. ఇందులో గ్రానైట్‌ నిక్షేపాలున్నాయని తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు.. ఈ భూములను కొట్టేయాలని అక్రమ రిజిస్ట్రేషన్లకూ పూనుకున్నారు. ఈ క్రమంలో ఆ భూములను పి.మధు పరిశీలించి హక్కుదార్లతో...

Pages