District News

కేరళ వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. సిపిఎం కార్యాలయాలపై ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి గూండాల దాడులను సిపిఎం కార్యకర్తలు, నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిపిఎంపై దాడులకు పాల్పడుతున్నారని, 90 ఏళ్ల దేశ చరిత్రలో ఉన్నడూ లేని విధంగా ఒక రాజకీయపార్టీ కార్యాలయాల ముందు మరో రాజకీయ పార్టీ ఆందోళనలు నిర్వహించడం ఇదే తొలిసారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విశాఖలోనూ ఇదే తరహాలో దాడులు చేశారని, ఇదే విధంగా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం వ్యవహరిస్తే తగిన బుద్ధి...

జిల్లా వ్యాప్తంగా ఉన్న కౌలురైతులకు వెంటనే పంటరుణాలు మంజూరు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. అమరావతి కళ్లం బ్రహ్మయ్య స్మారకభవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది కౌలురైతులుండగా కేవలం 30 వేల మందికే కౌలు గుర్తింపు కార్డులు ఇచ్చారని అన్నారు. పది వేల మందికి మాత్రమే పంటరుణాలు మంజూరు చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి కౌలురైతుకు గుర్తింపుకార్డులిచ్చి పంటరుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాటతప్పిందని అన్నారు. బ్యాంకులో రుణాలు మంజూరుకు ఆటంకం కలిగిస్తున్నారని జిల్లా ప్రభుత్వం జోక్యం చేసుకుని రుణాలు మంజూరు చేయించాలని కోరారు. గుంటూరు మార్కెట్‌యా...

వంశధార నిర్వాసితులకు ప్యాకేజీ, ఇళ్ల స్థలాలు, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని సిపిఎం పోరాడుతోంది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా పోలీసు బందోబస్తు మధ్య రిజర్వాయర్‌ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేయిస్తోంది.  నిర్వాసితులకు పూర్తిస్థాయి పరిహరం చెల్లించి పునరావాసం కల్పించాకే వంశధార ప్రాజెక్టు పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ పనులు అడ్డుకోవడానికి వెళుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి భవిరి.కృష్ణమూర్తి మరియు నాయకులను హీరమండలం బ్యారేజి సెంటర్లో పోలీసులు అరెస్టు చేశారు 

పెట్టుబడి దారి వ్యవస్థలో పాలకులు అవలంభిస్తున్న వైఖరి వల్ల దేశంలో దోపిడీ, ప్రజల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌.శర్మ పేర్కొన్నారు. సిపిఎం గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 'పెట్టుబడి గ్రంథం ప్రాముఖ్యత' అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరిగింది. శాసన మండలి మాజీ సభ్యులు కెఎస్‌ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో శర్మ మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పెట్టుబడిదారి వ్వవస్థ నుంచి మార్పును, విప్లవాన్ని కోరుకునే వారు తప్పని సరిగా కారల్‌ మార్క్స్‌ రాసిన పెట్టుబడి గ్రంధం చదవాలని కోరారు. పెట్టుబడీదారీ విధానానికి జీవకణం సరుకు అని, నీటిని, అంతరిక్షాన్ని సరుకుగా మార్చి సంపదగా కొంత మంది దోచుకుంటున్నారని అన్నారు. మానవ...

మానవ చరిత్రను మార్చిన అక్టోబరు మహా విప్లవం ఎన్నో ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. దేశంలో పాలకులు.. పెట్టుబడిదార్ల గుప్పిట్లో చిక్కుకున్న క్రమంలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులను సమీకరించి వారితో వామపక్ష ప్రజాతంత్ర సంఘటనను రూపొందించాలని పిలుపునిచ్చారు. గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన 'అక్టోబర్‌ మహా విప్లవ శతవార్షికోత్సవ సభ'కు ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షత వహించారు. ఏచూరి మాట్లాడుతూ.. అన్ని దేశాల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులతోనే ఉద్యమాలు నడుస్తున్నాయని చెప్పారు....

పాత్రికేయులు, హేతువాది గౌరీ లంకేష్‌ హత్యను ఖండిస్తూ వామపక్షాలు విశాఖలో నిరసన చేపట్టారు. మతతత్వ పాలకులు తమను వ్యతిరేకించే వారిని, ప్రశ్నించే వారిని భౌతికంగా నిర్మూలించే ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి పాలనలో మతతత్వ శక్తులు విజృంభించి కల్బుర్గి, ధబోల్కర్‌, పన్సారే వంటి హేతువాద, ప్రజాతంత్ర శక్తులను హత్యగావించిన తీరులోనే గౌరీ లంకేష్‌ను హత్య చేశారన్నారు. 

అనారోగ్యంతో గురువారం మృతి చెందిన సిపిఎం సీనియర్‌ సభ్యులు పోపూరి సుబ్బారావు అంత్యక్రియలు శుక్రవారం ఉదయం యడ్లపాడులోని సొంత వ్యవసాయ పొలంలో కుటుంబ సభ్యులు నిర్వహించారు. పార్టీలో నాలుగు దశాబ్ధాలపాటు క్రీయాశీలకంగా పనిచేసినా పోపూరి సుబ్బారావు మృతి వార్త తెలిసిన వెంటనే చిలకలూరిపేట డివిజన్‌లోని పలు గ్రామాల నుండి సిపిఎం కార్యకర్తలు ఆయన మృత దేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. రాష్ట్ర రైతు నాయకులు పోపూరి రామారావు ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ గ్రామంలో అనేక విషయాల్లో, వివిధ సందర్భాల్లో సేవలు చేసి, పార్టీలో అంకిత భావంతో పనిచేసిన కార్యకర్త సుబ్బారావు అని నివాళి అర్పించారు. చిలకలూరిపేట డివిజన్‌ సిపిఎం కన్వీనర్‌ పోపూరి సుబ్బారావు, సిపిఎం డివిజన్‌...

చరిత్ర గతిని మార్చిన సోవియట్‌ అక్టోబర్‌ మహా విప్లవం శత వార్షికోత్సవాలు, పెట్టుబడి గ్రంధం 150 ఏళ్ల ఉత్సవాలు, కారల్‌ మార్క్సు ద్విశత జయంతి సందర్భంగా ఈనెల 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సదస్సులో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొంటారని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు తెలిపారు. శుక్రవారం గుంటూరులోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు మహా విప్లవ ప్రాధాన్యత, సమకాలీనత అనే అంశంపై ఏచూరి ప్రారంభ ఉపన్యాసం చేస్తారని చెప్పారు. అలాగే పెట్టుబడి గ్రంధం ప్రాముఖ్యత అనే అంశంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్‌....

కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే ప్రజా ఉద్యమాలకు కేంద్రంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు అన్నారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో సిపిఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌ ప్రజాసంఘాల కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం జెండాను రాష్ట్ర కమిటీ సభ్యులు గద్దె చలమయ్య ఆవిష్కరించారు. సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమానికి గాడిదమళ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. పాశం రామారావు మాట్లాడుతూ చేజర్ల గ్రామంలో సిపిఎం నిర్మాణం పటిష్టంగా ఏర్పడాలని, ప్రజా సమస్యలపై కార్యకర్తలు...

Pages