బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి, మత కలహాలు సృష్టించి, ప్రజల శవాలపై రాజకీయాలు చేస్తోందని, దీనిని ప్రజలు ఎన్నడూ క్షమించరని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాజకీయ ప్రచార యాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా పలమనేరు అంబేద్కర్ సర్కిల్ నుండి బస్టాండ్ కూడలిలోని ఎటిఎం సర్కిల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిధర్ గుప్త అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..