District News

చరిత్రలో సిపిఎం-1

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడదీసి చూడలేం. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్‌ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ, అక్టోబరు విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్‌ తిరిగివచ్చినవారూ, ఖిలాఫత్‌, హిజ్రత్‌ ఉద్యమాలపై అక్టోబరు విప్లవప్రభావంవల్ల కమ్యూనిస్టులైనవారూ, గదర్‌ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారినవారూ, భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్‌ వారూ - ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు...

రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో రోడ్డెక్కారు. ఇంత పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడం, వివిధ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వారు భాగస్వాములు కావడం, అనేక రాష్ట్రాల్లో బంద్‌ వాతావరణం నెలకొనడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. కార్మికవర్గ ప్రతిఘటన కారణంగా సంస్కరణల అమలు విషయంలో భారత్‌లో అయోమయ వాతావరణం నెలకొందన్న అర్ధం వచ్చే శీర్షికతో '...

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్‌ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920) ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు జీవించే హక్కును, మానవ హక్కులను మంటగలిపేదిగా ఉందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినా...

జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం,
     అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు...

సార్వత్రిక సమ్మె తొలిరోజు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల సమ్మెలో భాగంగా తొలిరోజైన సోమవారం కార్మికలోకం కదం తొక్కింది. ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొడతామని, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన చేసింది. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు, ఉద్యోగులు ఈ సమ్మెలో భాగస్వాములయ్యారు.విజయవాడతో పాటు అన్ని జిల్లాల్లోనూ కార్మికులు ప్రదర్శనలు, సభలు నిర్వహించారు.సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పారిశ్రామిక నగరాలు, వాడల్లో సాధారణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. కోల్‌కత్తా, ముంబాయి వంటి నగరాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ సమ్మెలో భాగస్వాములయ్యారు. సింగరేణిలో దాదాపు నూరుశాతం...

Pages