యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ సంస్థ రూపొందించిన సీడ్ కాపిటల్ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్ కేపిటల్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు...
District News
రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వీసా వివాదంపై చర్చ జరగాలని కోరారు. అయితే విపక్ష సభ్యులు అడ్డుకోవడంతో డిప్యూటీ చైర్మెన్ కురియన్ సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభయ్యాక కూడా రాజ్యసభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు. 12 గంటల తర్వాత ప్రారంభమైన కొద్ది క్షణాలకే ప్రతిపక్ష సభ్యులు సభలో కార్యకలాపాలను అడ్డుకున్నారు. దీంతో రాజ్యసభ చైర్మెన్ హమిద్ అన్సారీ అరగంటపాటు వాయిదా వేశారు. అంతకు ముందు బొగ్గు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్రమంత్రి సంతోష్ బగ్రోడియాకు పాస్పోర్టు ఇప్పించాలని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత లాబీయింగ్ చేసినట్లు సుష్మా ట్వీట్ చేశారు. పార్లమెంటులో ఆ...
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించకుండా రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులు తిరిగొస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హెచ్చరించారు. మూడు వారాల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రత్యేక హోదాపై స్పష్టత తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వ ప్రకటన చేయించలేని పక్షంలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక లెనిన్ సెంటర్లో మంగళవారం మాక్ పార్లమెంట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కనీసం గంట సేపయినా రాష్ట్రానికి...
తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు. అరెస్టయి వన్టౌన్ పోలీసుస్టేషనులో ఉన్న ఆందోళనకారులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలతో పాటు పలు ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నేతలు కలిసి సంఘీభావం...
మున్సిపల్ ఉద్యోగు లు, కార్మికుల నిరవధిక సమ్మెకు మద్దతుగా రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం సోమవారం విజయవాడ ప్రెస్క్లబ్లో జరిగింది. మున్సిపల్ జేఏసీ నాయకులు ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన ఈ కార్య క్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగుల్లో అధిక శాతం దళితులే ఉన్నారన్నారు. వారికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కూడా అటకెక్కించిన ఘనత చంద్ర బాబు ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. గతే డాది ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిగి న సందర్భంలో మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు పెంచుతామని చంద్రబాబు వాగ్దానం చేశారని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల ఆందోళనను అణచివేయడానికి...
రానున్న పార్లమెంటు సమావేశాల్లో పలు కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్న భూ సేకరణ చట్టానికి సవరణ బిల్లుతో పాటు, ఎస్సీఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సవరణ, సరుకులు, సేవల బిల్లు (గూడ్స్ అండ్ సర్వీసెస్ -జిఎస్టి) బిల్లు వీటిలో కీలకమైనాయి. పన్నుల విధానంలో పెనుమార్పులు తీసుకువచ్చే జిఎస్టి బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున కసరత్తు చేస్తోందని, రాష్ట్రాల ప్రభుత్వాలతో, ఆర్థిక శాఖ మంత్రులతో అనేక దఫాలు చర్చించి,కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించినప్పటికీ స్థూలంగా అంగీకరించారంటూ...
కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ర్టాల జుట్లు ముడేసింది. రాష్ర్టాల మధ్య వివాదాలు ఏర్పడినప్పుడు పెద్దన్నయ్య పాత్ర పోషించాల్సిన కేంద్రం.... తెలుగు రాష్ర్టాల మధ్య సమస్యలను మరింత సంక్లిష్టం చేస్తోంది. ‘ట్యాపింగ్’ వివాదాన్ని సర్దుబాటు చేయాల్సిందిపోయి... సర్వీస్ ప్రొవైడర్లను వెనుకేసుకొచ్చే క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్య మరింత పెరిగేలా లేఖలు రాసింది. ‘మేం ట్యాపింగ్ చేయలేదు!’ అని తెలంగాణ ప్రభుత్వం, ఏసీబీ అధికారులు వాదిస్తుండగా... ఒకరాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, అధికారికంగానే సర్వీస్ ప్రొవైడర్లు ‘చర్య’లు తీసుకున్నారంటూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. ఈ విషయంలో సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అదే సమయంలో... ‘...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోతే తోడు వచ్చే పార్టీలతో కలిసి సీపీఐ ఆధ్వర్యంలో ఏపీ ఎంపీలకు హిజ్రాలతో సన్మానం చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు.
అక్రమ అరెస్టులు, ముఖ్యమంత్రి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జెఎసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. 18న ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్దం చేయాలని, నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని జెఎసి పిలుపునిచ్చింది. 18, 19తేదిల్లో ఎంఎల్ఎ, ఎంఎల్సిల మద్దతు కోరుతూ సామూహిక రాయబారాలు నిర్వహించాలని, 20న కుటుంబ సభ్యులతో భిక్షాటన, 21న జిల్లా కలెక్టరేట్ల పికెటింగ్, 22న రాస్తారోకోలు, 23న పట్టణాల్లో నిరసన ర్యాలీలు, 24న మంత్రుల ఇళ్లను హోరావ్ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మున్సిపల్, ఉద్యోగులు, కార్మికులకు జెఎసి విజ్ఞప్తి చేసింది.
మున్సిపల్ కార్మికుల జెఎసి ఆధ్వర్యంలో ఛలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి యత్నాన్ని పోలీసులు శుక్రవారం అడుగడుగునా అడ్డుకున్నారు. మహిళలను సైతం విచక్షణ రహితంగా లాగిపారేస్తూ పాశవికంగా వ్యవహరించారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది మున్సిపల్ పారిశుద్య కార్మికులు, వీరి ఆందోళనకు మద్దతుగా నిలిచిన వామపక్ష పార్టీలకు చెందిన నాయకులతో తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీని పోలీసులు పాత బస్టాండ్ సెంటరులో అడ్డుకున్నారు. ఒకింత భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిచారు. కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్ జెఎసి నాయకులను అరెస్టులు చేశారు. మహిళా కార్మికులను, మహిళా నాయకులను...