District News

ఉల్లి ధరలు తగ్గించాలని, రేషన్ డిపోల ద్వారా ప్రతి కుటుంబానికి 5కిలోల ఉల్లిపాయలు సప్లే చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని రైతుబజార్ లో పర్యటించి కొనుగోలుదారుల భాదలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కాశీనాద్, శ్రీదేవి తో పాటు సిపిఎం శ్రేణులు పాల్గొన్నారు..

ఇసుక సమస్య ను పరిష్కరించాలని, భవన నిర్మాణ కార్మికులకు భృతిగా నెలకు 10వేలు ఇవ్వాలని , ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలనీ డిమాండ్ చేస్తూ విజయవాడలో వామపక్ష పార్టీలు తలపెట్టిన ఇసుక మార్చ్ ను పోలీసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించగా  తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం వామపక్ష నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Pages