తులసిపాక వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల సిపిఐ(ఎం) దిగ్భ్రాంతి

భద్రాచలం సమీపంలో తులసిపాక వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం పట్ల సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి తీవ్ర సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.  బాధితులకు అండగా సిపిఎం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని స్థానిక నాయకత్వాన్ని,  కార్యకర్తలను కోరారు. ప్రభుత్వం తక్షణం సహాయం అందించి క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి