సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సిపిఐ(యం) ప్రగాఢ సంతాపం

ప్రచురణర్థం/ప్రసారార్థం:
సిపిఐ అగ్ర నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, వామపక్ష ఉద్యమానికి తీరని లోటని అన్నారు. విద్యార్థి ఉద్యమాలతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి సిపిఐ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా పార్లమెంటు సభ్యుడిగా పలు బాధ్యతలు నిర్వహించారు. వామపక్ష ఐక్యతకు కృషి చేశారు. సురవరం విజయలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీనివాసరావు సానుభూతి ప్రకటించారు.
 సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణకు సిపిఐ (యం) రాష్ట్ర కమిటీ తరఫున సంతాప సందేశం పంపారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి