ఈరోజు (11 జూన్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను
ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
సంతృప్తికరంగా లేని ఏడాది పాలన
టిడిపి కూటమి తీరుపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
జనానికి అప్పులు తప్ప ఆదాయం లేదు
కార్పొరేట్లకు భూ పందేరం
178 వాగ్దానాలకు 16 అమలు
వారానికి నాలుగు అత్యాచారాలు
చంద్రబాబును ఆడిస్తున్న కేంద్రం
రాష్ట్రంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి పాలన ఏడాదిలో ఏ మాత్రమూ
సంతృప్తికరంగా లేదని, జనానికి అప్పులు తప్ప ఆదాయం లేని పరిస్థితి
ఏర్పడిరదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం
విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ
సభ్యులు సిహెచ్.బాబూరావు, కె.ప్రభాకరరెడ్డి, సుబ్బరావమ్మ,
ఎ.వి.నాగేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. తొలుత ‘‘కార్పొరేట్లకు వరాలు
పేదలకు శాపాలు, దారితప్పుతున్న టిడిపి కూటమి ఏడాది పాలన’’ పేరుతో
ప్రచురించిన పుస్తకాన్ని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. గత వైసిపి ప్రభుత్వం
అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందనే ఉద్దేశంతో విసిగిపోయిన ప్రజలు 56 శాతం
ఓట్లతో 164 సీట్లు కట్టబెట్టారని, ఆ నమ్మకాన్ని టిడిపి కూటమి ప్రభుత్వం
నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. ప్రజల్లో నిరుత్సాహం, ఆందోళన, అసంతృప్తి
పెరిగిపోయాయని ప్రజలకు ఆదాయం లేదని, అప్పులు మిగిలాయని వివరించారు. ఎన్నికల
ముందు 178 వాగ్దానాలు ఇచ్చి ఏడాదిలో 16 వాగ్దానాలను అమలు చేశారని
పేర్కొన్నారు. గ్రేడ్ పాయింట్లు ఇవ్వాల్సి వస్తే 10కి 1.5 మాత్రమే కూటమి
పాలన సాధించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి చేయగలిగే సత్తా
ఉన్నా ప్రస్తుత డైరెక్టన్ తప్పుడు మార్గంలో నడుస్తోందని అన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారని, పరీక్షల
నిర్వహణకు ఏడాది పట్టిందని, కార్పొరేట్లకు సేవ చేయడంలో మాత్రం ఆలస్యం జరగడం
లేదని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విలువైన భూములను గ్రామసభలు
నిర్వహించకుండానే అదానీకి అప్పగిస్తున్నారని, చట్ట విరుద్ధమని తెలిపారు.
విశాఖలో 136 ఎకరాలు డేటా సెంటర్కు ఇస్తే అతీగతీ లేదని, కొత్తగా అమరావతిలో
7000 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డట్లు ప్రచారం జరుగుతోందన్నారు. టిసిఎస్
లాంటి నమ్మకమైన సంస్థలను అడ్డుపెట్టుకుని దానిమాటున అదానీ సేవ
చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు ఇచ్చిన భూముల్లో
కార్యకలాపాలు లేకపోతే ఐదేళ్లలో వెనక్కు తీసుకోవాలని అన్నారు. రాజధాని
ఏరియాలో భూములు అభివృద్ధి చేయకపోవడంతో పూలింగ్కు ఇచ్చిన రైతులకు నమ్మకం
సన్నగిల్లుతోందని వివరించారు. కార్పొరేట్లకు భూ పందేరం చేయడంలో ఉన్న శ్రద్ధ
వేగం, పేదలకు ఇళ్లు ఇవ్వడంలో లేదని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వ
సూచనల మేరకు ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేశారని పేర్కొన్నారు. వైసిపి
ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు వినాశకరమని టిడిపి నాయకులు
ప్రతిపక్షంలో ఉండగా కోర్టులో కేసులు వేసిన టిడిపి నాయకులు ఇప్పుడు
నోరెత్తడం లేదన్నారు. రూ.1780 కోట్లు లంచాలు ఇచ్చారని కేసులు నమోదైన
అదానీతోనే ఈ ప్రభుత్వం లావాదేవీలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. మహిళలపై
వారానికి నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని వివరించారు. అనంతపురంలో తన్మయి
హత్య, తెనాలిలో యువకులను రోడ్డుపై దారుణంగా కొట్టడం వంటి చర్యలతో గత
ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటో తెలియడం లేదని పేర్కొన్నారు.
పాలనలో మార్పులు కోరుకున్న టిడిపి నాయకులే రెండిటికీ తేడా లేదని ఆందోళన
వ్యక్తం చేస్తున్నారన్నారు. 5000 మంది ఉండే ఊరిలో బెల్టుషాపులు పెట్టి కోటి
రూపాయల వ్యాపారం చేస్తున్నారంటే రాష్ట్రంలో వాటి దోపిడీ ఎలా ఉందో అర్థం
చేసుకోవచ్చన్నారు. గతంలో చంద్రబాబు కేంద్రంలో ఏ ప్రభుత్వాన్నైనా
ఆడిరచేవారని, ఇప్పుడు మోడీ చంద్రబాబును ఆడిస్తున్నారని అన్నారు. తిండిలేక
కడుపు నిండనివారికి, పనిగంటలు పెరిగి ఒత్తిడికి గురవుతూ మానసిక ప్రశాంతతత
లేనివారికి వారికి యోగా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. యోగా పేరుతో
అధికారులను నెలరోజులుగా దానిచుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. రేషన్
బియ్యం ఎత్తేస్తారని డీలర్లు చెబుతున్నారని, బియ్యం నాసిరకంగా ఉంటే ఎవరూ
తీసుకోరని, మంచి బియ్యం ఇస్తే తీసుకుంటారని అన్నారు. ఇళ్లస్థలాల
రెగ్యులరైజ్ చేయడం లేదని, జిఓ ఇచ్చినా అమలు కావడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలు పాత ప్రభుత్వాన్ని తిట్టడానికి మినహా
కొత్త ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసేవిగా లేవని విమర్శించారు. యువతకు
ఉపాధి లేదని, స్కిల్ సెన్సస్ చేసినా దాన్ని ఏమి చేశారో చెప్పడం లేదని
అన్నారు. ఎన్నికల ముందు ప్రజావిజన్ చూపించి అధికారంలోకి వచ్చాక
కార్పొరేట్ విజన్ చూపిస్తున్నారని అన్నారు. సిపిఎం రాష్ట్ర
కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ రాష్ట్రంలో త్రిబుల్
ఇంజన్ ప్రభుత్వం పట్టాలు తప్పిందని 11 ఏళ్లు చీకటి పాలన సాగుతోందని
విమర్శించారు. బిజెపితో జతకట్టిన రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలు
నిలబడలేదని, ప్రజలు తిరస్కరించిన వైసిపి బాటలోనే టిడిపి కూటమి ప్రభుత్వం
నడుస్తోందని అన్నారు. మోడీ పాలనలో బాదుడు ఎక్కువ, సంక్షేమం తక్కువని
అన్నారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగులకొట్టాలని
పిలుపునిచ్చిన టిడిపి అధికారంలోకి ఇళ్లకు బిగిస్తోందని తెలిపారు. ఏడాది
కాలంలో గాడితప్పిన పాలనను సరిచేసుకుని నాలుగేళ్ల పాలనసాగించాలని సూచించారు.
లేనిపక్షంలో హామీల అమలు, భారాలకు వ్యతిరేకరంగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం
ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
కె.ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి రూ.20 వేల పెట్టుబడి సాయం
ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వాల
నిర్వాకంతో ప్రకాశం, బాపట్ల, నంద్యాల జిల్లాలో పొగాకు రైతులు ఆత్మహత్యలు
చేసుకున్నారని తెలిపారు. ధాన్యం మద్దతు ధర అమలు కావడం లేదన్నారు. సిపిఎం
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ మహిళల పట్ల
టిడిపి కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, చారిత్రక
అంగన్వాడీ సమ్మె సందర్బంగా ఇచ్చిన హామీ ప్రకారం జులైలో వేతనాలు పెంచాల్సి
ఉండగా పెంచలేదని అన్నారు. అప్పట్లో మహిళల వద్దకు వచ్చి మద్దతు ఇచ్చిన
చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని చెప్పారు.
మహిళలపై దాడులు జరుగుతుంటే నివారించాల్సిన ప్రభుత్వం రాత్రిళ్లు కూడా
వారితో పనిచేయించుకునేలా చట్టంలో మార్పులు చేసిందని అన్నారు. దీనివల్ల
వారిపై దాడులు మరింత పెరుగుతాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చట్టాలను
రద్దు చేయాలని కోరారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org