
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మే, 2025.
తిరుపతి అర్బన్ మండలం తిరుమల నగర్ పంచాయతీలోని
వేణుగోపాల కాలనీలో 80 ఇళ్ల కూల్చివేతకు సిపిఐ(యం) ఖండన
తిరుపతి జిల్లా, తిరుపతి అర్బన్ మండలం, తిరుమల నగర్ పంచాయతీ లోని మంగళం చెన్నాయి గుంట లెక్కదాకల సర్వే నంబర్ 211/2, 218/1లోగల పేదలు వేసుకున్న ఇళ్లను రాత్రి 12 గంటల సమయంలో 7 జెసిబిలు, 300 మంది గుండాలు వచ్చి 80 ఇళ్ళను పూర్తిగా నేలమట్టం చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండిరచారు. ఈ దుర్మార్గ ఘటనను వై.వెంకటేశ్వరరావు పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. సిపిఐ(యం) వారికి అండగా ఉంటుందని తెలిపారు.
పోలీసులు అడ్డుకున్నప్పటికీ దుండగులు విధ్వంస కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇళ్లలోని బంగారం, డబ్బు, సిలిండర్లు, టీవీలు తదితర విలువైన సామాగ్రిని ట్రాక్టర్లో వేసుకొని వెళ్లారు. కూల్చివేతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు స్పందించాలని వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధితులకు అండగా సిపిఐ(యం) ఉంటుందని, వారికి మద్దతు ఇచ్చే వారితో కలిసి ఉద్యమిస్తామని తెలిపారు. రిజిస్టర్ చేసుకుని ఇంటి పన్ను, కరెంటు మీటరు, పంచాయతీ బోరు కలిగిన వారిని సైతం జెసిబి లతో దుండగులు ధ్వంసం చేశారంటే బుల్డోజర్ సంస్కృతి ఆంధ్ర రాష్ట్రానికి కూడా ప్రవేశించిందని తెలిపారు. ఘటనపై పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, కూల్చిన ఇళ్లను తిరిగి నిర్మించాలని, వారికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి