
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 మే, 2025.
ఎన్కౌంటర్ మృతదేహాల దహనంపై న్యాయ విచారణ జరిపించాలి
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా మరో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా ఉద్దేశపూర్వకంగా పోలీసులు దహనం చేయటాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. నారాయణపూర్లో బంధువులు మృతదేహాలు అప్పగిస్తారని రోజులుగా పడిగాపులు కాస్తున్నా, బంధుమిత్రులకు మృత దేహాలను అప్పగిస్తామని చత్తీస్ఘర్ రాష్ట్ర హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ హామీ ఇచ్చినా, అయినవారు లేరని ఏకపక్షంగా మృత దేహాలను దహనం చేయటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. చర్చలు సిద్దమని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పౌర హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు చర్చలు జరపమని ప్రభుత్వాలను కోరాయి. అయినా ఎన్కౌంటర్ పేరుతో మావోయిస్టులను హత్య చేయటం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి