
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 24 మే, 2025.
యోగా పేరుతో విశాఖ తరలించొద్దు
కోవిడ్ హెచ్చరిక నేపధ్యంలో యోగాపై సర్వే ఆపాలి.
- సిపిఎం డిమాండ్
జూన్ 21న విశాఖపట్నంలో ప్రధానమంత్రి పాల్గొనే యోగా దినోత్సవం కోసం రాష్ట్ర మంతటి నుండి తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒకవైపు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలను తరలించడం ద్వారా కరోనా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. కరోనా కేసులు విశాఖపట్నం లో కూడా నమోదయ్యాయి. ఎక్కువ మంది ఒకచోట చేరడం ద్వారా గతంలో జరిగిన విషాదకర పరిణామాలు ప్రజల మదిలో వున్నాయి.
అంతర్జాతీయ యోగా డే కోసం రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటి సర్వే చేస్తూ పెద్ద సంఖ్యలో తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన మంత్రి మెప్పు కోసం చేసే ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతాయని సిపిఎం తెలిపింది. కరోనా హెచ్చరికల నేపధ్యంలో ఇంటింటి సర్వే తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి