విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా మార్చాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు
కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 16 నవంబర్‌, 2024.

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
        విషయం  : విశాఖపట్నం రుషికొండ భవనాలను సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంగా
మార్చాలని కోరుతూ...
అయ్యా!
        విశాఖపట్నం నగరంలోని రుషికొండపై గత ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అతిథి
గృహం నిర్వహణపై ఈనెల 18వ తేదీన శాసనసభలో చర్చ జరగబోతున్నట్లుగా మీడియాలో
చూశాను. గత ప్రభుత్వం విలాసవంతమైన ఈ భవనాన్ని నిర్మించడానికి సుమారు రూ.500
కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసింది. దానిని తిరిగి అతిథి గృహంగానో,
ప్రభుత్వ క్యాంపు ఆఫీసుగానో ఉపయోగించడం సరైంది కాదు. ప్రజాధనంతో నిర్మించిన
ఈ భవనం ప్రజలకే ఉపయోగపడాలి. ఆరీత్యా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు
స్వేచ్చగా భవనంలోకి అడుగుపెట్టి చూడడానికి అవకాశం కల్పించాలి. రాష్ట్ర
విభజన తరువాత హైదరాబాదు, బెంగళూరు తరహాలో విజ్ఞానవంతమైన సైన్సు మ్యూజియం
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేదు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలన్న
ప్రభుత్వ లక్ష్యానికనుగుణంగా సైన్సు అండ్‌ టెక్నాలజీ మ్యూజియంను ఈ భవనంలో
ఏర్పాటు చేస్తే విద్యార్ధులకు, యువతకు స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇందుకవసరమైన
నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చవచ్చు.
        కావున పై సూచనను గమనంలో ఉంచుకొని గత ప్రభుత్వ హయాంలో అత్యంత వివాదాస్పదమైన
ఈ భవనాన్ని మీ ప్రభుత్వ హయాంలో అర్థవంతంగా మార్చగలరని ఆశిస్తున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org