
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజిఎన్ఆర్ఇజిఎస్) కింద వేతనాన్ని రోజుకు రూ.180 నుంచి రూ.194కు పెంచుతూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన వేతనాలు ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.