
పనామా పేపర్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. వివిధ దేశాలకు చెందిన నేతలు సెల్రబిటీల పేర్లు ఈ జాబితాలో ఉండటమే దీనికి కారణం. పన్ను ఎగవేతకు పాల్పడిన వారిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు, బార్సిలోనా ఫార్వర్డ్ లియోనెల్ మెస్సీ, దాదాపు 1.15 కోట్ల రికార్డులున్న ఈ పత్రాలలో 2.14 లక్షల మంది విదేశృ ప్రముఖుల పేర్లున్నాయని ఐసిఐజె వివరించింది. ఈ పత్రాలు పనామాకు చెందిన న్యాయవ్యవహారాల సంస్థ మొస్సాక్ఫొనెస్కా నుండి లీకయినట్లు తెలుస్తోంది.