కరవుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

కరవుకు సంబంధించి చేపట్టిన చర్యలపై సుప్రీం కోర్టు గురువారం కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్ని రాష్ట్రాల్లో కరవు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేశారని అడిగింది. జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ సంస్థలను ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. ఈ వివరాలను తనకు తెలియజేయాలని జస్టిస్‌ ఎం.బి.లోకుర్‌, జస్టిస్‌ ఎన్‌.వి.రమణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కరవు మాన్యువల్‌, కరవు నిర్వహణ మార్గదర్శకాలపై పూర్తి వివరాలు సమర్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది.