
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్సియు) ఘటనపై మేధావులు, విద్యావేత్తలు, రచయితలు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులు స్పందించారు. తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. హెచ్సియులో జరుగుతున్న చట్ట వ్యతిరేక చర్యలను ఖండించారు. ఈ మేరకు వీరంతా కలిసి ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ప్రకటనపై సంతకం చేసిన వారిలో నోమ్ చామ్స్కీ, డా|| గాయత్రి చక్రవర్తి, స్పివాక్, డా|| బార్బరా హారిస్ వైట్, డా||గిలియన్ హార్ట్, డా|| మైఖేల్ డేవిస్ వంటి ప్రముఖులు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన 352 మంది ప్రొఫెసర్లు కూడా ప్రకటనపై సంతకాలు చేశారు.