
కేంద్రప్రభుత్వం నియమించిన 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను వ్యతిరేకిస్తూ చేపట్టనున్న సార్వత్రిక సమ్మెపై నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్(ఎన్.ఎఫ్.ఐ.ఆర్), దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్.. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను సేకరించనున్నాయి. ఇందుకు గాను ఈ నెల 8, 9 తేదీల్లో ఓటింగ్ను నిర్వహించనున్నారు.