
శబరిమలై ఆలయంలోకి మహిళలను నిషేధించడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం, ఆలయబోర్డును ప్రశ్నించడాన్ని సిపిఎం స్వాగతించింది. 2008లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉండగా అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్కు తాము మద్దతిచ్చామని గుర్తు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రభుత్వం పిటిషన్పై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మహిళలకు ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కని సిపిఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు..