
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సీపీఐ (ఎం)జరుప తలపెట్టిన ప్లీనం ఏర్పాట్లు విస్తృతంగా జరుగు తున్నాయి. ప్లీనం ఏర్పాట్లతో కోల్కత్తా నగరం ఎర్రబారింది. 37ఏళ్ల తర్వాత జరుగుతున్న సీపీఐ(ఎం) ప్లీనంలో 456 మంది ప్రతినిధులు హాజరవుతారని రబీన్ దేవ్ తెలిపారు. డిసెంబర్ 20న పీడీజీ భవన్లో ప్లీనం ప్రారంభమవుతుందని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 77, 247 బూత్లలో ఉన్న ప్రజలందరినీ కదిలించే విధంగా కోల్కత్తా నగరం ఐదు వైపుల నుంచి ఐదు ర్యాలీలుగా దాదాపు పది లక్షల మంది ప్రజలు రానున్నారని ఆయన తెలిపారు.