అమిత్‌షా పీఠానికి ఎసరు..

బీహార్‌లో బిజెపికి వ్యతిరేకంగా వచ్చిన ఫలి తాలు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా పీఠానికే ఉచ్చు బిగిస్తున్నాయి. జనవరితో షా ప్రస్తుత పదవీకాలం ముగిసి పోతోంది. ఆ సమయానికి మంత్రివర్గంలో చోటు కల్పించ డం ద్వారా షాను తన చెంత నుంచి దూరం కాకుండా చూసుకోవాలని మోడీ ఆలోచిస్తున్నారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.. బీహార్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడై నప్పటి నుంచి షా వ్యవహార శైలిపై విమర్శలు వినిపిస్తున్నాయి.