తీవ్రం కానున్నOROP ఆందోళన..

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌కు సంబంధించి అన్ని డిమాండ్లను అమలు చేయలేమంటూ రక్షణ మంత్రి మనోహర్ పారికర్ చేసిన ప్రకటనపై మాజీ సైనికులు విరుచుకు పడుతున్నారు. ఈ ప్రకటనకు నిరసనగా మంగళవారం నుంచి తమ పతకాలను వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తాము లెక్కకు మించిన డిమాండ్లు చేయడం లేదని తమ డిమాండ్ ఒక్కటేనని అది ఒకే ర్యాంకు ఒకే పెన్షనేనని వారు స్పష్టం చేశారు. గతంలో తమకు వచ్చిన పతకాలను రేపటి నుంచి వెనక్కి ఇచ్చేయడం ద్వారా తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించారు.