TDP మట్టిమాఫియా:దడాల

అధికార పార్టీ నాయకులు, మట్టిమాఫియా, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కై రామేశంపేట మెట్ట భూమిలో మట్టిని కొల్లగొట్టుకుపోతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు ఆందోళన వ్యక్తంచేశారు. రామేశంపేట మెట్ట భూముల దళిత రైతులు సిపిఎం ఆధ్వర్యాన పెద్దాపురం తహశీల్దార్‌, ఆర్‌డిఒ కార్యాలయాల వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దడాల మాట్లాడుతూ దళితులకు ఉపాధి నిమిత్తం ఇచ్చిన అసైన్డ్‌ భూములను 9/77 యాక్టు ప్రకారం అమ్మకాలుగానీ, కొనుగోళ్లు గానీ చేయకూడదన్నారు. జిఒ 2/2013ను చూపించి చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని విమర్శించారు. రామేశంపేట మెట్టచుట్టూ నోట్లకట్టల రాజకీయం నడుస్తోందన్నారు.