RSSపై పరోక్ష్యంగా మాజీ జస్టిస్ విమర్శలు

ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి ఏ ఒక్కరికో ఓట్లు వేయొద్దని ముస్లింలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం అహ్మదీ పరోక్షంగా సూచించారు. ‘‘నిక్కర్లు ధరించి చేతిలో లాఠీలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేవారిని చూసి భయపడకండి. ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు కేవలం ఎన్నికల సమయంలోనే వారు బయటకు వస్తారు. అది ఎన్నికల ప్రక్రియలో భాగం’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు ప్రస్తావించకుండా అహ్మదీ పేర్కొన్నారు.