CPM Babu Rao fires on Electricity department over kurnool deaths

ఊర్మిళసుబ్బారావునగర్‌లో విషాదం చోటుచేసుకుంది. బ్రహ్మంగారి మఠం వద్ద ఓ ఇంట్లో విద్యుత్‌షాక్‌ తగిలి ఐదుగురు మృతి చెందారు. తెగిపడ్డ కరెంట్ తీగను సరిచేయబోయిన వ్యక్తికి కరెంట్‌షాక్‌ తగిలింది. ఇతన్ని కాపాడపోయిన మరో నలుగురు మృతి చెందారు. ఈ ఘటనకు విద్యుత్ శాఖ బాధ్యత వహించాలని సీపీఎం నేత బాబూరావు డిమాండ్ చేశారు. అంతే కాకుండా బాధిత కుటుంబాలకు రూ. 5లక్షల నష్టపరిహారం చెల్లించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు ఇళ్ల మధ్యలో వద్దని గతంలో ఎన్ని సార్లు మొర పెట్టుకున్నాపట్టించుకోలేదని వాపోయారు. ఏపీ రాజధాని అమరావతిలో మాదిరి ఇక్కడ కూడా భూమి లోపల అండర్ విద్యుత్ లైన్ల వ్యవస్థను ఏర్పాట్లు చేయాలన్నారు. అయితే మరో వైపు ఏపీ సర్కార్ మృతులు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.